Ashwin: వాసన చూసి జెర్సీని పసిగట్టిన అశ్విన్.. నవ్వులు పంచుతున్న వీడియో!
రవిచంద్రన్ అశ్విన్ గ్రౌండ్లో ఉన్న జెర్సీలను వాసన చూసి, తనదో కాదో నిర్ధారించుకుంటూ వీడియోలో కనిపించారు. మ్యాచ్ సందర్భంగా అప్పుడు గుర్తించలేకపోయినా, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా, మైదానంలో ఆటగాళ్లు, స్టాండ్స్లో ప్రేక్షకులు చేసే కొన్ని విషయాలు భలే ఆసక్తిగా అనిపిస్తాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గమనించలేని విషయాలు సోషల్మీడియాలో వైరల్ అవుతుంటాయి. టీమ్ ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్లో భాగంగా గ్రూప్ దశలో భారత్-జింబాబ్వేల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ ముందు టాస్ వేసే కార్యక్రమం జరుగుతుండగా, అప్పటివరకూ ప్రాక్టీస్లో ఉన్న కొందరు ఆటగాళ్లు మైదానం వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ గ్రౌండ్లో ఉన్న జెర్సీలను వాసన చూసి, తనదో కాదో నిర్ధారించుకుంటూ వీడియోలో కనిపించారు. మ్యాచ్ సందర్భంగా అప్పుడు గుర్తించలేకపోయినా, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ‘ఇది దుస్తులను గుర్తించే అసలైన మార్గం’ అంటూ ఓ నెటిజన్ ఆ వీడియోను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ‘చాలా మంది చేసే పని ఇదే’, ‘శీతాకాలంలో దుస్తులు ఉతకాల్సి వచ్చినప్పుడు ఇదే టెక్నిక్ నేనూ వాడతా’, ‘భారత్లో ఇది మామూలు విషయం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈట్వీట్ చూసిన అశ్విన్ కూడా స్పందించాడు.
‘‘సైజును బట్టి వేరు చేయడానికి కాదు.. అదే మొదటిసారి వేసుకుందా? అని పరిశీలించడానికి కాదు. ఎందుకంటే, నేను వాడే పెర్ఫ్యూమ్ అదేనా అని చెక్ చేస్తున్నా.. అరే.. కెమెరామెన్’’అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. ఈ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించి, టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్కు వెళ్లిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?