అశ్విన్, కుల్దీప్, పాండ్య ‘వాతి’ స్టెప్పులు..
ఇంగ్లాండ్పై రెండో టెస్టు గెలిచాక టీమ్ఇండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన కోహ్లీసేన తర్వాతి టెస్టులో...
వీడియో పంచుకున్న టీమ్ఇండియా స్పిన్నర్
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్పై రెండో టెస్టు గెలిచాక టీమ్ఇండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన కోహ్లీసేన తర్వాతి టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. అయితే, మూడో టెస్టు ఈనెల 24న అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో జరగనుండటంతో ఇప్పటికే ఇరు జట్లూ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఈ క్రమంలో వారికి వారం రోజుల విశ్రాంతి దొరకడంతో టీమ్ఇండియా ఆటగాళ్లు సంతోషంగా గడుపుతున్నారు.
అందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా రవిచంద్రన్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని వాతి పాటకు స్టెప్పులేశాడు. అందులో అశ్విన్తో పాటు హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్లు కూడా కాలు కదిపారు. మొతేరా స్టేడియంలోని జిమ్లో వీరంతా ఉత్సాహంగా చిందులేశారు. ఇది చూసి వాతి సంతోషపడతాడంటూ అశ్విన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఈ చెన్నై స్పిన్నర్ రెండో టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన అతడు బ్యాటింగ్లోనూ శతకంతో మెరిశాడు. దీంతో భారత్ సిరీస్లో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు తొలి టెస్టులో అవకాశం రాని కుల్దీప్ రెండో టెస్టులో తక్కువ ఓవర్లే బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అక్షర్ పటేల్, అశ్విన్ రాణించడంతో కుల్దీప్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక టీమ్ఇండియా కీలక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టు జట్టుకు ఎంపికైనా తుది జట్టులో ఇంకా అవకాశం రాలేదు. మరి బుధవారం నుంచి ప్రారంభమయ్యే డే/నైట్ టెస్టులోనైనా అతడికి అవకాశం వస్తుందో లేదో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!