Jay Shah: జై షాపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి: ఏసీసీ
ఏసీసీ షెడ్యూల్ రూపకల్పనలో జై షా (Jay Shah) ఏకపక్షంగా వ్యవహరించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నజిమ్ సేథి చేసిన ఆరోపణలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఖండించింది.
ఇంటర్నెట్ డెస్క్: తమను సంప్రదించకుండా 2023-23కు సంబంధించి ఏసీసీ క్యాలెండర్ను ప్రకటించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజిమ్ సేథి ఆసియా క్రికెట్ కౌన్సిల్పై విమర్శలు చేశారు. ఈ విషయంలో ఏసీసీ అధ్యక్షుడు జై షా (Jay Shah) ఏకపక్షంగా వ్యవహరించారని నజిమ్ సేథి ఆరోపించారు. ‘ఏసీసీ క్యాలెండర్ను ముఖ్యంగా పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఆసియాకప్ వివరాలను ఏకపక్షంగా ప్రకటించినందుకు జై షాకు కృతజ్ఞతలు. పీఎస్ఎల్ 2023 క్యాలెండర్నూ మీరే ప్రకటించండి’ అని పీసీబీ (PCB) చీఫ్ నజమ్సేథి వ్యంగంగా ట్వీట్ చేశాడు. ఈ ఆరోపణలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఖండించింది. ఏసీసీ షెడ్యూల్ రూపకల్పన కోసం 2022 డిసెంబర్లో పాకిస్థాన్తోపాటు అన్ని సభ్య దేశాల నుంచి సలహాలు, సూచనలు కోరామని ఏసీసీ పేర్కొంది. కొన్ని సభ్యదేశాలు తమ అభిప్రాయాన్ని పంచుకోగా.. పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేసింది.
‘ఏసీసీ అధ్యక్షుడు జై షా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని షెడ్యూల్ను రూపొందించి ప్రకటించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజిమ్ సేథి ఆరోపణలు చేశారు. ఈ విషయంలో స్పష్టత రావాలని ఏసీసీ కోరుకుంటోంది. షెడ్యూల్ రూపకల్పన సరైన విధానంలోనే జరిగింది. 2022, డిసెంబరు 13న జరిగిన సమావేశంలో అభివృద్ధి, ఆర్థిక, మార్కెటింగ్ కమిటీ షెడ్యూల్ను ఆమోదించింది. ఈ క్యాలెండర్ గురించి పాకిస్థాన్తో సహా అన్ని సభ్యదేశాలకు డిసెంబర్ 22న ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాం. అప్పుడు షెడ్యూల్ గురించి పీసీబీ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా నజిమ్ సేథి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. వాటిని ఏసీసీ తీవ్రంగా ఖండిస్తుంది’
ఆసియాకప్ సెప్టెంబరులో జరుగుతుందని, టోర్నీ ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్లో ఉంటుందని గురువారం ఏసీసీ ప్రకటించింది. అయితే టోర్నీకి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందో చెప్పలేదు. షెడ్యూల్ను కూడా ప్రకటించలేదు. వాస్తవానికి 2023 ఆసియా కప్ పాకిస్థాన్లో జరగాలి. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్లో ఆడటానికి భారత్ సిద్ధంగా లేదు. ఈ టోర్నీలో భారత్తోపాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, ఓ క్వాలిఫయర్ జట్టు పోటీపడతాయి. దాయాదులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు