Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్లో భారత్కు పతకాల వర్షం
ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్లో భారత్కు పతకాల వర్షం కురిసింది. మహిళల 5000 మీ ఫైనల్లో పారుల్ చౌదరీ పసిడి పతకాన్ని పట్టేసింది.
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్లో భారత్కు పతకాల వర్షం కురిసింది. మహిళల 5000 మీ ఫైనల్లో పారుల్ చౌదరీ పసిడి పతకాన్ని పట్టేసింది. రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తిన చివర్లో వేగం పెంచి మొదటి స్థానంలో నిలిచింది. మొదటి నుంచి వేగంగా పరుగెత్తిన రిరికా హిరోనకా (జపాన్) చివర్లో శక్తిని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పారుల్కిది రెండో పతకం. సోమవారం మహిళల 3000మీ. స్టీపుల్ఛేజ్లో పారుల్ రజత పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మహిళల జావెలిన్త్రో ఫైనల్లో అన్నురాణి (62.92 మీ) ఈటెను విసిరి స్వర్ణం అందుకుంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో విద్య రామ్రాజ్ (55.68 సె) కాంస్య పతకం అందుకుంది. పురుషుల 800 మీ ఫైనల్లో మహ్మద్ అఫ్సల్, డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ రజత పతకాలు సాధించారు. పురుషుల ట్రిపుల్జంప్ ఫైనల్లో ప్రవీణ్ (16.68 మీ) కాంస్య పతకం అందుకున్నాడు. పురుషుల బాక్సింగ్లో (+92కేజీలు) సెమీ ఫైనల్లో నరేందర్ కమ్షిబెక్ (కజకిస్థాన్) చేతిలో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీ. హర్డిల్స్ ఫైనల్లో భారత్కు పతకాలు రాలేదు. పాలక్షా ఐదో స్థానంలో, సంతోష్ కుమార్ ఆరో స్థానంలో నిలిచారు. మహిళల హైజంప్లో ఫైనల్లో పుజా ఆరు, రుబీనా తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం మీద భారత్ ఇప్పటివరకు 69 పతకాలు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఇందులో 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్య పతకాలున్నాయి.
నేడు (మంగళవారం) పతకాలు సాధించినవారు
పారుల్ చౌదరీ.. (మహిళల 5000 మీ) స్వర్ణం
అన్ను రాణి (జావెలిన్ త్రో) స్వర్ణం
అప్సల్ (పురుషుల 800 మీ) రజతం
తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్) రజతం
అర్జున్ సింగ్, సునీల్ సింగ్ (కనోయింగ్ డబుల్స్) కాంస్యం
ప్రీతి (బాక్సింగ్, 54 కేజీలు) కాంస్యం
విద్య రామ్రాజ్ (మహిళల 400 మీటర్ల హర్డిల్స్) కాంస్యం
ప్రవీణ్ (ట్రిపుల్ జంప్) కాంస్యం
నరేందర్ (బాక్సింగ్) కాంస్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: ముందుంది సఫారీ సవాల్..
దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమ్ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. అయితే, టెస్టు సిరీస్ను ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగబోతోంది. -
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి దూసుకొచ్చిన భారత యువ స్పిన్నర్
టీమ్ఇండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. -
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యాఖ్యానించాడు. -
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణాలతో దీపక్ చాహర్ (Deepak Chahar) ఆసీస్తో ఐదో టీ20లో ఆడలేదు. దీంతో అభిమానులంతా ఏమైందోనని కంగారు పడ్డారు. దానికి దీపక్ చాహర్ స్పందించాడు. -
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్
భారత జట్టులో (Team India) ఓపెనర్లకు కొదవేం లేదు. అయితే, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరం. టీ20 వరల్డ్కప్లో రోహిత్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. దీంతో అతడికి జోడీగా ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఇద్దరికి దక్షిణాఫ్రికాతో సిరీస్ అత్యంత కీలకం కానుంది. -
Lionel Messi: టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా మెస్సీ
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టైమ్ పత్రిక అతడిని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్గా ప్రకటించింది. -
Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్
వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2024) భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ నాయకత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెప్టెన్సీని ధోనీతో పోలుస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
T20 WC 2024: టీ20 ప్రపంచకప్లో రోహితే సారథి!
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. -
INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్
భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. -
Pro Kabaddi League: విజృంభించిన సోను
రైడర్ సోను జగ్లాన్ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. -
junior hockey wc: అర్జీత్ హ్యాట్రిక్
జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు అదిరే ఆరంభం. అర్జీత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో మంగళవారం పూల్-సి మ్యాచ్లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. -
భారత్కు మూడు స్వర్ణాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాయల్, నిషా, ఆకాన్ష పసిడి పతకాలతో మెరిశారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్ (తజికిస్థాన్)ను చిత్తుగా చేయగా..70 కేజీల తుదిపోరులో ఆకాన్ష అంతే తేడాతో తైమజోవా (రష్యా)ను ఓడించింది. -
Sourav Ganguly: కోహ్లీని నేను తప్పించలేదు
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమణ
విజయ్ హజారె ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ నుంచి హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమించాయి. పేలవ ప్రదర్శనతో గ్రూపు దశను దాటలేకపోయాయి. ఏడు మ్యాచ్ల్లో నాల్గింట్లో గెలిచి.. మూడింట్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో గ్రూపు-బి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. -
Sports News: ఆ ఒక్క అథ్లెట్ డోపీనే
ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్ మీట్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు. -
IPL 2024 mini auction: ‘ఆ ఇద్దరి కోసం ముంబయి ఇండియన్స్ పోటీ పడుతోంది’
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్ కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: ముందుంది సఫారీ సవాల్..
-
Stock Market: మూడోరోజూ రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 20,900 పైన ముగిసిన నిఫ్టీ
-
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి దూసుకొచ్చిన భారత యువ స్పిన్నర్
-
Gurpatwant Singh Pannun: పన్నూ బెదిరింపుల వీడియో.. దిల్లీలో అలర్ట్
-
Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. ఆనందంగా ఉందంటూ అట్లీ పోస్ట్
-
AP High Court: విశాఖకు కార్యాలయాలను తరలించడంపై జీవో.. హైకోర్టులో విచారణ