e-auction: భవానీదేవి కత్తికి రూ.10కోట్లు.. నీరజ్ ఈటెకు రూ.1.20కోట్లు
టోక్యో ఒలింపిక్స్ భారత్ తరఫున ఫెన్సింగ్లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది ఫెన్సర్ భవానీదేవి. ఆ క్రీడల్లో ఓటమిపాలైనప్పటికీ స్ఫూర్తిదాయక ప్రదర్శన
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరఫున ఫెన్సింగ్లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది ఫెన్సర్ భవానీదేవి. ఆ క్రీడల్లో ఓటమిపాలైనప్పటికీ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి యావత్ భారతావని ప్రశంసలు అందుకుంది. అందుకేనేమో ఒలింపిక్స్లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి కూడా అంతే ఆదరణ లభిస్తోంది. ప్రధానమంత్రికి వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా భవానీదేవి కత్తిని వేలం వేయగా.. ఇప్పటికే బిడ్ ధర రూ.10కోట్లకు చేరింది. ఇక పారాలింపిక్స్లో స్వర్ణపతకం అందుకున్న షట్లర్ కృష్ణ నాగర్ ఉపయోగించిన రాకెట్ ధర కూడా రూ.10కోట్లకు చేరింది.
ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని.. వివిధ సందర్భాలు, పర్యటనల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారుల పరికరాలు, దుస్తులను కూడా వేలానికి ఉంచారు. భవానీదేవి కత్తిని రూ.60లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10కోట్లతో కొనసాగుతోంది. పారాలింపియన్ కృష్ణనాగర్ రాకెట్కు బేస్ ధర రూ.80లక్షలు కాగా.. ప్రస్తుతం రూ.10కోట్లకు చేరింది. పారాలింపిక్స్లో రజతం సాధించిన మరో షట్లర్ సుహాస్ యతిరాజ్ రాకెట్ను రూ.50లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10కోట్లతో కొనసాగుతోంది.
రూ.90లక్షలు దాటిన సింధు రాకెట్..
ఇక టోక్యో ఒలింపిక్స్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ.కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20కోట్లతో కొనసాగుతోంది. ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్కు రూ.80లక్షల బేస్ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం దాని ధర రూ.90లక్షలు దాటింది. టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్ సంచలనం లవ్లీనా బోర్గొహేన్ చేతి గ్లౌజులను రూ. 80లక్షలతో వేలం ప్రారంభించగా.. ప్రస్తుత ధర రూ.1.80కోట్లుగా ఉంది.
కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు ఈ వేలం కొనసాగనుంది. వేలం పూర్తయిన తర్వాత అత్యధిక ధరతో బిడ్ వేసిన వారికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!