Rohit Sharma: ఫిట్గా ఉన్నా.. అన్ని ఫార్మాట్లూ ఆడతా: రోహిత్
ప్రస్తుతానికైతే నాకెలాంటి సమస్యలు లేవు, పూర్తి ఫిట్గా ఉన్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇటీవల అతడు టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్..
ఇంటర్నెట్ డెస్క్ : ప్రస్తుతానికైతే నాకెలాంటి సమస్యలు లేవు, పూర్తి ఫిట్గా ఉన్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇటీవల అతడు టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ ఫిట్నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా వరుసగా పలు కీలక సిరీసులు ఆడనుంది. ఈ నేపథ్యంలో అతడు అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించగలడా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంకతో రేపటి (ఫిబ్రవరి 24) నుంచి టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అతడు మాట్లాడాడు. తన ఫిట్నెస్ గురించి, జట్టు గురించి పలు విషయాలు వెల్లడించాడు.
‘ప్రస్తుతం నేను పూర్తి ఫిట్గా ఉన్నాను. ఎలాంటి సమస్యలు లేవు. అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. తర్వాత ఏం జరుగుతుందో అనే దానిపైనే పని ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. రోజురోజుకీ పరిస్థితులను అర్థం చేసుకోగలుతాం. జట్టు కోసం మనం ఏం చేయాలనే విషయంపై స్పష్టత వస్తుంది. విశ్రాంతి అవసరమనిపిస్తే కచ్చితంగా కొంత కాలం బ్రేక్ తీసుకుంటా. నా స్థానంలో మరొకరు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అతడు ఏ మేరకు రాణించగలడో తెలుస్తుంది’ అని రోహిత్ అన్నాడు.
* రంజీల్లో సత్తా చాటితే.. అవకాశాలు వాటంతట అవే వస్తాయి
‘యువ ఆటగాళ్లకు నేను చెప్పేది ఒకటే.. రంజీల్లో సత్తా చాటితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్లో చోటు దక్కించుకున్న హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ తదితరులు రంజీల్లో సత్తా చాటిన వారే. అందుకే, యువ ఆటగాళ్లు వేరే ఆలోచనలు లేకుండా రంజీల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు కచ్చితంగా టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తుంది. ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. పిచ్ స్వభావం, ప్రత్యర్థి జట్టు బలాబలాలు ఏంటి? ఇలా అనేక విషయాలపై చర్చించాకే తుది జట్టు ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా మూడు టెస్టు మ్యాచులు ఆడనుంది. మన దేశంలో ఆడనున్న రెండు టెస్టులకు జట్టును ప్రకటించాం. కానీ, ఇంగ్లాండ్లో జరుగనున్న టెస్టు మ్యాచుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ’ అని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ టోర్నీలో అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్, ముంబయి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తదితరులు సెంచరీలతో సత్తా చాటిన విషయం తెలిసిందే.
* సంజూ శాంసన్కు మద్దతుగా నిలుస్తాం..
‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సంజూ శాంసన్ చాలా గొప్ప ఇన్నింగ్స్లు ఆడాడు. అతడిలో గొప్ప నైపుణ్యం ఉంది. వైవిధ్యమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. అలాంటి షాట్లు అందరూ ఆడలేరు. అతడికి ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో కచ్చితంగా చోటు దక్కుతుందనుకుంటున్నాను. అక్కడి పిచ్లపై శాంసన్ సులభంగా షాట్లు ఆడగలడు. అయితే, వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటామనేదే కీలకం. టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి మేం అతడికి మద్దతుగా నిలుస్తాం. ఈ విషయాన్ని అతడు అర్థం చేసుకుంటాడనుకుంటున్నాను. అందుకే, శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్ కోసం అతడిని జట్టులోకి తీసుకున్నాం. అతడిలోని టాలెంట్ని నిరూపించుకునేందుకు ఇది చక్కటి అవకాశం’ అని రోహిత్ పేర్కొన్నాడు. శ్రీలంకతో రేపటి నుంచి జరుగనున్న టీ20 సిరీస్లో సంజూ శాంసన్కి చోటు దక్కిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!