Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
వీసా ఆలస్యం కారణంగా భారత్కు వచ్చే ఫ్లైట్ మిస్సయ్యాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. దీంతో నిరాశ చెందిన అతడు ఒక ఆసక్తికర మీమ్ను ఇన్స్టాలో పోస్టు చేశాడు. అది ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: వీసా ఆలస్యం కారణంగా భారత్కు వచ్చే ఫ్లైట్ మిస్సయ్యాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. అందువల్ల అతడు భారత్కు ఆలస్యంగా చేరుకోనున్నాడు. దీంతో నిరాశ చెందిన ఖవాజా..సామాజిక మాధ్యమాల్లో ఒక మీమ్ పోస్టు చేయగా అది వైరల్గా మారింది. నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే ఓ షోకు సంబంధించిన ఫొటో పోస్టు చేసి..‘‘భారత వీసా కోసం నేనూ ఇలాగే ఎదురుచూస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు నెట్టింట హల్చల్ చేస్తోంది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9న భారత్ వేదికగా ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు మంగళవారం భారత్ చేరుకున్నారు. తన వీసా బుధవారం వస్తే గురువారం భారత్కు చేరుకోవచ్చని ఖవాజా ఆశిస్తున్నాడు. అయితే అతడికి వీసా ఆలస్యమవడం ఇదేం తొలిసారి కాదు. 2011లో ఐపీఎల్ సమయంలోనూ అతడు ఇదే తరహా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. భారత అధికారుల చొరవతో ఆ సమస్య పరిష్కారమైంది. ఆస్ట్రేలియా జట్టులో ఖవాజా కీలక ఆటగాడు. అద్భుతమైన స్పిన్నర్. గతేడాది 11 టెస్టు మ్యాచులు ఆడిన అతడు 4 శతకాలు ,5 అర్ధ శతకాలు బాది 1,080 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఉత్తమ టెస్టు ఆటగాడిగా అతడు సిడ్నీలో సోమవారం షేన్ వార్న్ అవార్డు అందుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.