T20 World Cup: పాకిస్థాన్కు షాక్.. ఫైనల్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో పాకిస్థాన్కు షాక్. ఈ మెగా టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జైత్రయాత్ర చేస్తున్న పాకిస్థాన్కు ఆస్ట్రేలియా అడ్డుకట్టవేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ జైత్రయాత్రకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో నెగ్గి సెమీస్కు చేరిన పాక్కు రెండో సెమీ ఫైనల్లో ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది. డేవిడ్ వార్నర్ (49; 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), మార్కస్ స్టాయినిస్ (40; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్ (41; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. షాహీన్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్లో వేడ్ చివరి మూడు బంతులకు మూడు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టినా ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా విజయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూ వేడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
సిక్సర్లతో విరుచుకుపడ్డ వేడ్..
177 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0)ని షాహీన్ ఆఫ్రిది వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ (28)తో వార్నర్ జతకట్టాడు. మార్ష్ కాస్త నెమ్మదిగా ఆడినా వార్నర్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇమాద్ వసీమ్ వేసిన 4 ఓవర్లో వార్నర్ ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. రవూఫ్ వేసిన తర్వాతి ఓవర్లో మార్ష్ సిక్స్, ఫోర్ బాదాడు. షాదాబ్ఖాన్ వేసినా ఏడో ఓవర్లో మిచెల్ మార్ష్.. అసిఫ్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన స్మిత్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కొద్దిసేపటికే వార్నర్, మ్యాక్స్వెల్ (7) కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. తర్వాత స్కోరు నెమ్మదించింది. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకున్న మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్ గేర్లు మార్చి ఆడారు. ముఖ్యంగా వేడ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హసన్ అలీ వేసిన 18 ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన అతడు.. షాహీన్ వేసిన 19 ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో చివరి మూడు బంతులకు మూడు సిక్స్లు కొట్టి జట్టును ఫైనల్కు చేర్చాడు.
అదిరే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్లో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పాకిస్థాన్కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (67; 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), బాబర్ అజామ్(39 : 34 బంతుల్లో 5 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాక్స్వెల్ వేసిన మూడో ఓవర్లో చెరో ఫోర్ కొట్టగా.. హేజిల్వుడ్ వేసిన ఐదో ఓవర్లో రిజ్వాన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో పాక్ 9 ఓవర్లకు 68/0తో నిలిచింది. ఈ క్రమంలోనే జంపా వేసిన పదో ఓవర్లో చివరి బంతికి బాబర్ అజామ్.. వార్నర్కి చిక్కాడు. అనంతరం ఫకార్ జమాన్(55; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు)తో జట్టు కట్టిన రిజ్వాన్ జోరు పెంచాడు. జంపా వేసిన వేసిన 12 ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్వుడ్ వేసిన 17వ ఓవర్లో రిజ్వాన్ ఫోర్, సిక్సర్ బాదగా.. జమాన్ కూడా సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లో రిజ్వాన్.. స్మిత్కి చిక్కాడు. అయితే జమాన్ ఏ మాత్రం జోరు తగ్గించలేదు. అదే ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. 19 ఓవర్లో అసిఫ్ అలీ (0), చివరి ఓవర్లో షోయబ్ మాలిక్ (1) వెనుదిరిగారు. ఆఖరి ఓవర్లో ఫకార్ జమాన్ రెండు సిక్స్లు బాదడంతో పాక్ భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్, జంపా తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్