IND vs AUS: ఇందౌర్ పిచ్కు ‘పేలవం’ రేటింగ్.. అదే కదా వారి పని: ఆసీస్ కోచ్
ఇందౌర్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో (IND vs AUS) ఆసీస్ చేతిలో భారత్కు పరాభవం తప్పలేదు. కేవలం రెండున్నర రోజులోపే మ్యాచ్ ముగియడంతో పిచ్కు ఐసీసీ (ICC) రేటింగ్ ఇస్తూ డీమెరిట్ పాయింట్లను జతచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు వేదిక ఇందౌర్ పిచ్కు ఐసీసీ (ICC) ‘పేలవ’ రేటింగ్ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ తీరుపై టీమ్ఇండియా (Team India) దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందౌర్కు మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. గబ్బా పిచ్పైనా ప్రశ్నలు సంధించాడు. తాజాగా ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ (Andrew McDonald) ఇదే విషయంపై స్పందించాడు. ఆటగాళ్ల కర్తవ్యం ఆడటం వరకేనని, ఐసీసీ (ICC) తమ బాధ్యత ప్రతి పిచ్కు రేటింగ్ ఇవ్వడమని వ్యాఖ్యానించాడు.
‘‘ఎలాంటి పిచ్ అయినా ప్లేయర్లుగా మన పని ఆడటమే. ఏదిఏమైనాసరే సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఇక ఐసీసీ ప్రతి పిచ్కూ రేటింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇందౌర్ పిచ్కు ‘పేలవం’ రేటింగ్ ఇచ్చింది. మంచి రేటింగ్ ఇచ్చినప్పుడు మనం అస్సలు మాట్లాడం. కాబట్టి, ఐసీసీ నిర్ణయాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారో వారిష్టం (విమర్శకులు). అయితే, పిచ్ పరిస్థితులు మాత్రం దారుణంగానే ఉన్నాయి. గత మూడు టెస్టుల్లోనూ ఆతిథ్య జట్టు ఇలాంటి వాటినే వినియోగించి ఉంటుందని నేను భావిస్తున్నా’’ అని మెక్డొనాల్డ్ తెలిపాడు.
ఐసీసీ పిచ్, అవుట్ఫీల్డ్ మానిటరింగ్ కమిటీ ప్రకారం.. ఏదైనా క్రికెట్ వేదికకు ఐదేళ్ల కాలంలో 5 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆసీస్తో మూడో టెస్టు అనంతరం ఇందౌర్ స్టేడియానికి మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇక సిరీస్ విజేతను తేల్చే నాలుగో టెస్టు మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో భారత్ కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ మన సొంతమవుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ టాప్ ర్యాంక్నూ ఖాతాలో వేసుకొనే ఛాన్స్ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు