T20 World Cup: ఫైనల్లో ఆ జట్టుకే విజయావకాలు ఎక్కువ : వీవీఎస్‌ లక్ష్మణ్‌

టీ20 ప్రపంచ కప్‌ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరుగున్న మ్యాచ్‌లో విజేత ఎవరో తేలిపోనుంది. ఫైనల్ చేరిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి టీ20..

Published : 13 Nov 2021 14:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో విజేత ఎవరో తేలిపోనుంది. ఫైనల్ చేరిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి టీ20 టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే చేతి గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరం కావడం కివీస్ జట్టుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు.

‘టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ చేరిన ఇరు జట్లలో ఆసీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌ జట్టులో కీలక ఆటగాడైన డెవాన్ కాన్వే గాయపడటం ఆ జట్టుపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ, టాస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, టీ20 క్రికెట్లో టాస్ గెలిచినంత మాత్రాన విజయం సాధిస్తామనే అంచనాకు రాలేం. ఒక్కోసారి మెరుగ్గా రాణించిన జట్టు కూడా ఓటమి పాలు కావొచ్చు’ అని లక్ష్మణ్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో కివీస్ విజయంలో డెవాన్ కాన్వే (46) కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఔటైన తర్వాత అతడు అసహనంతో బ్యాట్‌తో కుడి చేతికి పొరపాటున కొట్టుకోవడంతో గాయమైంది. దీంతో అతడు ఫైనల్‌తో పాటు.. త్వరలో టీమిండియాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు కూడా దూరమైన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని