టీ బ్రేక్‌: ఆసీస్‌ 243/7

బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. నాలుగో రోజు టీ విరామానికి ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది....

Published : 18 Jan 2021 10:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. నాలుగో రోజు టీ విరామానికి ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ కంటే 276 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం కమిన్స్‌ (2), స్టార్క్‌ (1) క్రీజులో ఉన్నారు. అయితే, నిర్ణీత సమయం కంటే ముందే అంపైర్లు టీ విరామం ఇచ్చారు. మబ్బుల వల్ల మైదానంలో ఓ వైపు వెలుతురు తక్కువగా ఉంది. దీంతో ఆటను నిలిపివేసి, పిచ్‌ను కవర్లతో కప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని