సిరాజ్‌కు మరో వికెట్‌..ఆసీస్ ఆధిక్యం 287

బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన స్టార్క్‌ (1) మిడ్‌ఆన్‌లో...

Published : 18 Jan 2021 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్: బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన స్టార్క్‌ (1) మిడ్‌ఆన్‌లో ఉన్న నవదీప్‌ సైని చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆసీస్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. టీమిండియా కంటే 287 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో కమిన్స్‌ (9), లైయన్‌ (4) ఉన్నారు. ఇన్నింగ్స్‌ చివర్లో ఆసీస్ ధాటిగా ఆడటానికి ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని