Jasprit Bumrah: ఇలా అయితే.. బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడటం కష్టం: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా టీమ్ఇండియా బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు వెన్ను నొప్పి తిరగబెట్టడం.. ఎన్సీఏ వైద్య బృందం దాదాపు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన సూచించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో కేవలం ఐదు టీ20లను మాత్రమే ఆడిన బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఐదు మ్యాచుల్లో 13 వికెట్లు, 10 టెస్టుల్లో 22 వికెట్లు తీశాడు. సిరీస్, సిరీస్కు మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆడటం గమనార్హం. అయితే భారత టీ20 లీగ్లోని అన్ని మ్యాచ్లను బుమ్రా ఆడాడు. అప్పట్లోనే దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. జాతీయ జట్టు తరఫున ఆడేటప్పుడు మాత్రమే గాయాలు గుర్తుకొస్తాయని.. ఫ్రాంచైజీ క్రికెట్ను మాత్రం వదలరని ట్రోల్ చేశారు. గాయాలబారిన పడుతున్న బుమ్రా సుదీర్ఘకాలంపాటు మూడు ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడతాడో లేదోననే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఆసీస్ దిగ్గజ క్రికెటర్ జెఫ్ థామ్సన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘‘మూడు ఫార్మాట్లలో ఆడిన బుమ్రా అతడి శరీరంపై శ్రమ పెట్టాడు. అందువల్లే గాయాలబారిన పడ్డాడు. దీంతో భవిష్యత్తులో ఏం చేయాలని అనుకుంటున్నాడో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత బుమ్రాపై ఉంది. ఆటగాడి కెరీర్లో ఓ దశాబ్దంపాటు మాత్రమే అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్ చేయగలడు. ఆ తర్వాత నుంచి కెరీర్ ఉత్తమంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి.. సుదీర్ఘకాలం దేశం కోసం సేవ చేయడంలో ఏం సహాయపడుతుందో తెలుసుకోవాలి’’
ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మాట్లలో బుమ్రా ‘తెల్ల బంతి’ క్రికెట్ను ఎంచుకోవడం ఉత్తమమని జెఫ్ సూచించాడు. ‘‘క్రికెట్ అభిమానులు ఏం కోరుకుంటున్నారు.. అతడు ఏం చేయాలని భావిస్తున్నాడనేది ముఖ్యం. తెల్ల బంతి క్రికెట్లో టీమ్ఇండియా తరఫున బుమ్రా ఆడి ప్రపంచకప్లను అందించాలని అభిమానులు కోరుకుంటుంటే.. దాని కోసం అతడు ఎందుకు ఎంచుకోకూడదు? ఇలా గాయాలబారిన పడుతుంటే మాత్రం మూడు ఫార్మాట్లను ఆడటం చాలా కష్టం. అయితే ఇదంతా అతడి వ్యక్తిగతం. అతడి హృదయానికి ఏం చేయాలని అనిపిస్తే అలాంటి నిర్ణయం తీసుకొంటాడు’’ అని జెఫ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.