WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆసీస్.. భారత్ సమీకరణాలు ఇలా..
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2023) ఫైనల్కు ఆసీస్ దూసుకెళ్లింది. ఇక రెండో స్థానంలో నిలిచిన భారత్కు (Team India) శ్రీలంక నుంచి ముప్పు వాటిల్లేలా ఉంది. కివీస్పై 2-0 తేడాతో టెస్టు సిరీస్ను (SL vs NZ) లంక గెలిస్తే.. భారత్ ఆశలకు అడ్డుకట్ట పడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో ఆసీస్కు (Australia) తొలి విజయం దక్కింది. మూడు రోజు తొలి సెషన్లోపే ముగిసిన మ్యాచ్లో భారత్పై 9 వికెట్ల తేడాతో (IND vs AUS) గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. వరుసగా రెండు టెస్టులను ఓడిపోయినప్పటికీ.. మూడో టెస్టులో విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లిపోవడం విశేషం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసీస్ 68.52 పర్సేంటేజీతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టీమ్ఇండియా 60.29 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (52.38) భారత్కు పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
భారత్ సమీకరణాలు ఇలా...
* మార్చి 9 నుంచి న్యూజిలాండ్ - శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో శ్రీలంక విజయం సాధిస్తే మాత్రం భారత్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఒకవేళ ఆసీస్పై నాలుగో టెస్టులో టీమ్ఇండియా గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు మనదే అవుతుంది.
* కివీస్పై లంక 2-0 తేడాతో టెస్టు సిరీస్ను గెలిచి.. టీమ్ఇండియా నాలుగో టెస్టులో ఓడితే మాత్రం ఆశలు గల్లంతు అయినట్లే. అప్పుడు శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది. వరుసగా రెండో సారి ఫైనల్కు చేరదామని భావిస్తున్న భారత్కు చుక్కెదురువుతుంది.
* శ్రీలంక కనీసం ఒక్క టెస్టు ఓడిపోయినా సరే భారత్ ముందంజ వేయడం ఖాయం. అప్పుడు ఆసీస్పై నాలుగో టెస్టు గెలిస్తే టీమ్ఇండియా అగ్రస్థానంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది.
* మార్చి 9 నుంచి ఆసీస్తో జరిగే నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్యూటీసీ ఫైనల్కు చేరుతుంది. అలాగే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!