ఆరో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న గ్రీన్‌ (37)ను శార్దూల్ ఠాకూర్‌ చక్కని బంతితో పెవిలియన్‌కు చేర్చాడు..

Published : 18 Jan 2021 09:53 IST

ఇంటర్నెట్‌డెస్క్: గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న గ్రీన్‌ (37)ను శార్దూల్ ఠాకూర్‌ చక్కని బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన గ్రీన్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో పైన్‌ (16), కమిన్స్‌ (2) ఉన్నారు.  ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. టీమిండియా కంటే 263 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదీ చదవండి

స్మిత్ ఔట్‌: ఆసీస్ ఆధిక్యం 229

లంచ్‌ విరామానికి ఆసీస్‌ 149/4

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని