PAK vs AUS: 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా

24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టింది. 1998లో చివరిసారి మార్క్‌ టేలర్‌ సారథ్యంలో పాక్‌లో పర్యటించిన కంగారూల జట్టు మళ్లీ ఇన్నాళ్లకు అక్కడ ఆడేందుకు సిద్ధమైంది...

Published : 27 Feb 2022 17:07 IST

(Photo: Pakistan Cricket Board Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టింది. 1998లో చివరిసారి మార్క్‌ టేలర్‌ సారథ్యంలో పాక్‌లో పర్యటించిన కంగారూల జట్టు మళ్లీ ఇన్నాళ్లకు అక్కడ ఆడేందుకు సిద్ధమైంది. అప్పుడు ఆస్ట్రేలియా 1-0తో మూడు టెస్టుల సిరీస్‌తో పాటు 3-0తో మూడు వన్డేల  సిరీస్‌నూ ఎగరేసుకుపోయింది. ఇక తాజాగా ప్యాట్‌ కమిన్స్‌ నేతృత్వంలో 18 మంది ఆటగాళ్ల బృందం ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇది కెప్టెన్‌గా కమిన్స్‌కు తొలి అంతర్జాతీయ పర్యటన కావడం విశేషం. మరోవైపు ఇటీవలే ఆసీస్‌ హెడ్‌కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆండ్రూ డోనాల్డ్‌ ఆ జట్టుకు కోచ్‌గా తాత్కాలిక సేవలు అందిస్తున్నాడు.

కాగా, 2009లో శ్రీలంక పాక్‌ పర్యటనలో ఉండగా ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆ దేశంలో క్రికెట్‌ ఆడేందుకు అంతర్జాతీయ జట్లు వెనుకడుగు వేశాయి. ఈ క్రమంలోనే ఆరేళ్ల పాటు పాకిస్థాన్‌ సైతం స్వదేశీ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించింది. అయితే, గతేడాది నుంచి ఇతర జట్లు పాక్‌లో పర్యటించడానికి సిద్ధపడినా గత సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌ టీమ్‌, అక్టోబర్‌లో ఇంగ్లాండ్‌ టీమ్‌ తమ పర్యటనలను అర్థాంతరంగా వద్దనుకున్నాయి. భద్రతా కారణాలతోనే ఆయా జట్లు వెనుకడుగు వేశాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఇప్పుడు అక్కడ పర్యటించడం గమానర్హం. మరోవైపు పాక్‌లో ఆడేందుకు పలువురు ఆసీస్‌ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టులు కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని