భారత బౌలర్లు శభాష్: మెక్గ్రాత్
తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారని ఆ జట్టు మాజీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ ప్రశంసించాడు...
సిడ్నీ: తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారని ఆ జట్టు మాజీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ ప్రశంసించాడు. అయితే, స్మిత్ 20, 30 పరుగులు చేశాడంటే నిలువరించడం కష్టమని చెప్పాడు. అడిలైడ్ టెస్టులో స్మిత్ 1, 1* పరుగులు చేయగా మెల్బోర్న్లో 0, 8 పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత బౌలర్లు అతడిని కట్టడి చేసే విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని మాజీ పేసర్ పేర్కొన్నాడు.
‘స్మిత్ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. ఆ ప్రణాళిక చాలా ఆసక్తిగా ఉండడంతో పాటు ఇప్పటి వరకూ ఫలించింది. యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ కూడా ఇలాగే ప్రయత్నించి విఫలమైంది. స్మిత్ బ్యాటింగ్ చేసేటప్పుడు టీమ్ఇండియా లెగ్గల్లీలో ఫీల్డర్ను ఉంచి ఫలితం సాధించింది. అయితే, అతడు ఒక్కసారి కుదురుకున్నాడంటే ఆపడం చాలా కష్టం. పిచ్ను అర్థం చేసుకుంటే పెద్ద స్కోర్లు సాధిస్తాడు. ఇక ఈ సిరీస్లో అశ్విన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పలుమార్లు స్మిత్ను ఔట్ చేశాడు’ అని మెక్గ్రాత్ వివరించాడు.
ఇక తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే ఆలౌటై.. ఘోర పరాజయం చూడడంతో సిరీస్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని అనుకున్నట్లు మెక్గ్రాత్ చెప్పాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద భారత్కు తిరిగి వచ్చాక టీమ్ఇండియా అద్భుతంగా పుంజుకుందని మెచ్చుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, అతడి సారథ్యంలో భారత ఆటగాళ్లు బాగా ఆడారన్నాడు. దీంతో మెల్బోర్న్లో మ్యాచ్ గెలిచి సిరీస్లో సమానంగా నిలిచారని కొనియాడాడు.
ఇవీ చదవండి..
జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్ కంటతడి..
డేవిడ్ వార్నర్ నాలుగేళ్లలో ఇలా తొలిసారి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్