24 గంటలు.. 14 రోజులు
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ నిర్వహణలో భారతీయుల పాత్ర కీలకమని టోర్నీ సీఈఓ క్రెయిగ్ టైలీ అన్నాడు. సోమవారం మెల్బోర్న్లో ప్రారంభంకానున్న...
‘ఈనాడు’తో ఆస్ట్రేలియన్ ఓపెన్ సీఈఓ క్రెయిగ్ టైలీ
క్వారంటైన్లో గదిలోనే క్రీడాకారులు
భారతీయుల పాత్ర కీలకం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ నిర్వహణలో భారతీయుల పాత్ర కీలకమని టోర్నీ సీఈఓ క్రెయిగ్ టైలీ అన్నాడు. సోమవారం మెల్బోర్న్లో ప్రారంభంకానున్న ఈ గ్రాండ్స్లామ్ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్న క్రెయిగ్ టైలీతో ముఖాముఖి ‘ఈనాడు’కు ప్రత్యేకం.
ఈనాడు - హైదరాబాద్
కరోనా నేపథ్యంలో టోర్నీ నిర్వహణలో సవాళ్లేంటి?
చాలామంది టోర్నీ జరగదని అనుకున్నారు. బయటకు రాలేని అనిశ్చితి నేపథ్యంలో టెన్నిస్ చూడలేమన్న ఆందోళన ఆసీస్ సమాజంలోనూ కనిపించింది. రెండున్నర కిలోమీటర్ల పొడవున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించాం. క్రీడాకారులు, సిబ్బంది, అభిమానులు సహా ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన జోన్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఈ ప్రాంతంలో ఎవరికైనా కరోనా సోకితే వెంటనే గుర్తించే వ్యవస్థను రూపొదించాం. టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ కొందరిలో అనుమానాలున్నా సోమవారం గ్రాండ్స్లామ్ ప్రారంభమవుతుంది. అభిమానుల్లో ఎవరైనా పాజిటివ్ ఉంటే వెంటనే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేశాం. భారత క్రీడాకారుల్లో కొందరు నాకు బాగా తెలుసు. వారందరికీ ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.
క్వారంటైన్ సమయంలో క్రీడాకారుల్లో ధైర్యాన్ని ఎలా నింపారు?
క్వారంటైన్ గురించి తెలుసుకోవడం.. అందులో ఉండటంలో చాలా వ్యత్యాసం ఉంది. బయటకు వచ్చి ఎప్పట్లాగే ఉండొచ్చని క్రీడాకారులు భావించి ఉండొచ్చు. కాని అలా కాదు. పూర్తిగా గదిలోనే ఉండాలి. రోజుకు అయిదు గంటలు క్రీడాకారులు గది నుంచి బయటకు రావొచ్చు. ఆ సమయంలో సాధన, జిమ్ చేసుకోవచ్చు. ఒకసారి గదిలోకి వెళ్లిన తర్వాత మళ్లీ బయటకు రాకూడదు. అంటే రోజులో 19 గంటలు గదిలోనే ఉండాలి. ఒకవేళ కరోనా పాజిటివ్తో దగ్గరి కాంటాక్ట్ ఉంటే 14 రోజులు 24 గంటల పాటు గదికే పరిమితం కావాలి. కొందరు గదుల్లోనే ఉండటం.. మరికొందరు బయట తిరుగుతుండటాన్ని క్రీడాకారులు అన్యాయంగా భావించేవాళ్లు. ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి కఠిన నిబంధనలు తప్పలేదు.
హోటల్ సిబ్బందిలో ఒకరు పాజిటివ్గా తేలితే ఒకరోజు అన్నీ ఆపేశారు. టోర్నీ మధ్యలో అలా జరిగితే ఏం చేస్తారు?
హోటల్లో పనిచేసే ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో అక్కడున్న వాళ్లందరినీ ఒకరోజు ఐసోలేషన్లో ఉంచాం. సుమారు 500 మందికి మరోసారి పరీక్షలు నిర్వహించాం. అందరికీ నెగెటివ్ వచ్చింది. 24 గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. ఆకస్మిక పరిస్థితులకు తగ్గట్లు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. 650 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు.. పది వేల మంది తాత్కాలిక సిబ్బంది సహాయంతో టోర్నీ నిర్వహిస్తున్నాం. అందులో భారతీయులు కూడా ఉన్నారు. వాళ్ల పనితీరు పట్ల గర్వంగా ఉన్నా.
టెన్నిస్ క్రీడాకారులకు టీకాలు వేయించే అవకాశం ఉందా?
అలాంటి ఆలోచన లేదు. క్రీడాకారులు భిన్న దేశాలకు చెందినవాళ్లు. ఆయా దేశాల్లోని పద్ధతుల్ని వారు అనుసరిస్తారు. టెన్నిస్ క్రీడాకారులతో సహా అథ్లెట్లు మరికొంత కాలం ఎదురు చూడాలేమో. వారి వంతు వచ్చేసరికి ఆర్నెల్లు పట్టొచ్చు. వచ్చేవారంలో ఆస్ట్రేలియాలో టీకాలు ప్రారంభమవుతాయి. ఫ్రెంచ్ ఓపెన్ లేదా వింబుల్డన్ సమయానికి టెన్నిస్ క్రీడాకారులంతా టీకాలు వేయించుకునే అవకాశముంది.
ఇవీ చదవండి..
వారెవా మేయర్స్
ముప్పు తప్పేనా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్