Djokovic - Rafael Nadal : ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా ఓపెనే ముఖ్యం : రఫేల్ నాదల్
సెర్బియా ఆటగాడు, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొనకుండా నిషేధం విధించడంపై ఆటగాళ్ల నుంచి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి....
ఇంటర్నెట్ డెస్క్ : సెర్బియా ఆటగాడు, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొనకుండా నిషేధం విధించడంపై ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన స్పెయిన్ ఆటగాడు రఫేల్ నాదల్.. ‘ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణే చాలా ముఖ్యమైనది. జకోవిచ్ ఆడినా, ఆడకపోయినా ఆస్ట్రేలియన్ ఓపెన్ గొప్పగా సాగుతుంది. జకోవిచ్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించనప్పటికీ.. ఒక వ్యక్తిగా, గొప్ప టెన్నిస్ క్రీడాకారుడిగా అతడిని ఎప్పుడూ గౌరవిస్తాను. దాదాపు రెండు వారాలుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికి.. ఆటపై దృష్టి పెట్టాల్సి ఉంది’ అని నాదల్ అన్నాడు.
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ నవోమి ఒసాకా కూడా ఈ వివాదంపై స్పందించింది. జకోవిచ్ లాంటి దిగ్గజ ఆటగాడు ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనకుండా నిషేధం విధించడం దురదృష్టకరమని పేర్కొంది. ‘జకోవిచ్ సొంత నిబంధనల ప్రకారం ఆడాలనుకుంటున్నాడు. గత రెండు వారాలుగా ఎక్కడ చూసినా అతడికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. చాలా మంది టెన్నిస్ను పక్కన పెట్టి జకోవిచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. అందుకే, నేను టెన్నిస్ గురించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను’ అని గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్ విమర్శించాడు.
‘ఈ వివాదం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బ తీస్తోంది. కరోనా కారణంగా ఆస్ట్రేలియా పౌరులు ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ప్రతి ఒక్క ఆటగాడు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే’ అని ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ పేర్కొన్నాడు. ‘చాలా రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇది టెన్నిస్కు గానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్కు గానీ అంత మంచిది కాదు. వ్యక్తిగతంగా జకోవిచ్కు కూడా మేలు చేకూర్చేది కాదు’ అని ఆండీ ముర్రే అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం