Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్..మహిళల విభాగంలో టాప్ సీడ్లకు చుక్కెదురు
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ మహిళల సీడెడ్ ప్లేయర్లకు చుక్కెదురైంది. టాప్ క్రీడాకారిణులు...
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ మహిళల విభాగంలో టాప్ సీడెడ్ ప్లేయర్లకు చుక్కెదురైంది. టాప్ క్రీడాకారిణులు ఎమ్మా రదుకాను, ముగురుజ, కొంటావెల్ట్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్ 3 ర్యాంకర్ గార్బిన్ ముగురుజ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ అయిన అలీజె కార్నెట్ చేతిలో 6-3, 6-3 తేడాతో ముగురుజ ఓటమి పాలైంది. వరుసగా రెండు సెట్లలోనూ ముగురుజ బ్రేక్ పాయింట్ సాధించలేకపోయింది. దాదాపు 33 అనవసర తప్పిదాలు చేయడంతో ఓడిపోవాల్సి వచ్చింది. ‘‘నా ఆట తీరుపట్ల ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యర్థి బాగా ఆడింది. అయితే రెండో రౌండ్లోనే ఓటమితో నిరుత్సాహానికి గురయ్యా’’ అని ముగురుజ పేర్కొంది. ప్రస్తుతం కార్నెట్ 61వ ర్యాంక్లో కొనసాగుతోంది.
యూఎస్ ఓపెన్ ఛాంపియన్కూ తప్పని ఓటమి
యూఎస్ ఛాంపియన్ ఎమ్మా రదుకాను 17వ సీడెడ్ క్రీడాకారిణిగా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగింది. అయితే మాంటెనెగ్రో ప్లేయర్ దన్కా కొవినిక్ చేతిలో ఓటమిపాలైంది. రెండో రౌండ్లో 6-4, 4-6, 6-3 తేడాతో రదుకానుపై కొవినిక్ విజయం సాధించింది. కొవినిక్ అంతర్జాతీయ ర్యాంక్ 98 కావడం గమనార్హం. తొలి రౌండ్లో 2017 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అయిన స్లోనే స్టీఫెన్స్ను రదుకాను ఓడించిన విషయం తెలిసిందే. ఇక ఆరో సీడ్ కొంటావెల్ట్ (ఇస్తోనియా) 2-6, 4-6 తేడాతో టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. ఇక నంబర్ 2 సీడెడ్ సబాలెంక (బెలారస్) 1-6, 6-4, 6-2 తేడాతో వాంగ్ (చైనా)పై గెలుపొందింది. ఏడో సీడ్ క్రీడాకారిణి స్వైతెక్ (పొలాండ్) 6-2, 6-2 తేడాతో స్వీడన్కు చెందిన ఆర్ పీటర్సన్పై విజయం సాధించింది.
పురుషుల విభాగంలో..
రష్యన్ ఆటగాడు, రెండో సీడెడ్ ప్లేయర్ డానీ మెద్వెదెవ్ ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో నిక్ కైర్గోస్ (ఆసీస్)పై 7-6, 6-4, 4-6, 6-2 తేడాతో విజయం సాధించాడు. మరొక మ్యాచ్లో నాలుగో సీడ్ ఆటగాడు సిట్సిపాస్ (గ్రీస్) 7-6, 6-7, 6-3, 6-4 తేడాతో బాయెజ్పై (అర్జెంటీనా) గెలుపొందాడు. ఇక 13వ సీడెడ్ ఆటగాడు స్కావర్జ్మన్ (అర్జెంటీనా) 6-7, 4-6, 4-6 తేడాతో క్రిస్టోఫర్ కార్నెల్ (ఆసీస్) చేతిలో ఓడిపోయాడు. ఏకపక్షంగా సాగిన మరొక మ్యాచ్లో రష్యన్ స్టార్ ఆండ్రే రుబ్లేవ్ (5వ సీడ్) 6-4, 6-2, 6-0 తేడాతో బెరాంకిస్పై (లూథియానా) ఘన విజయం సాధించాడు. మాజీ ప్రపంచ నంబర్వన్ ఆటగాడు ఆండీ ముర్రే రెండో రౌండ్లో క్వాలిఫయిర్ టారో డానియల్ చేతిలో ఓడిపోయాడు. 120వ ర్యాంకర్ టారో 6-4, 6-4, 6-4 తేడాతో ముర్రేపై విజయం సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు