Babar Azam: టీమ్ఇండియాపై పాక్ ప్రధాని సెటైర్.. బాబర్ అజామ్ స్పందన ఇదే..
టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా సెమీస్ను ఘోర పరాభవంతో నిష్క్రమించడంపై పాక్ ప్రధాని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆయన చేసిన ‘‘152/0 vs 170/0’’ వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అంచనాలను తలకిందులు చేస్తూ టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు దూసుకెళ్లింది పాకిస్థాన్. మెల్బోర్న్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫైనల్ సన్నద్ధతపై పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఓటమిని విమర్శిస్తూ పాక్ ప్రధాని చేసిన ట్వీట్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బాబర్ స్పందించాడు. ఆ ట్వీట్ గురించి తాను మాట్లాడలేనని తెలిపాడు.
కీలక సెమీస్ పోరులో భారత జట్టు.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒక్క వికెట్ కోల్పోకుండా 169 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్ పూర్తి చేసింది. దీంతో ఆ మ్యాచ్ అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విటర్ వేదికగా టీమ్ఇండియాపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘152/0 vs 170/0’’ అని ట్వీట్ చేశారు. 152/0 అంటే గతేడాది టీ20 ప్రపంచకప్లో భారత్పై ఛేదనలో పాక్ చేసిన స్కోరు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్పై వికెట్ కోల్పోకుండా విజయాలు సాధించిన ఈ రెండు జట్లు ఈ సారి ఫైనల్లో తలపడుతున్నాయన్న అర్థంలో.. టీమ్ఇండియాను విమర్శిస్తూ పాక్ ప్రధాని ఈ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్గా మారింది.
ఈ ట్వీట్ గురించి మీడియా సమావేశంలో విలేకరులు పాక్ కెప్టెన్ను ప్రశ్నించారు. దీనికి బాబర్ బదులిస్తూ.. ‘‘క్షమించాలి. నేను ఆ ట్వీట్ చూడలేదు. దానిపై నాకు అవగాహన లేదు కాబట్టి నేను మాట్లాడలేను. అయితే ప్రత్యర్థిపై అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు మేం 100శాతం ప్రయత్నిస్తాం’’ అని తెలిపాడు. ఇక.. 1992 వన్డే ప్రపంచకప్ టోర్నీకి.. ఇప్పటి టీ20 ప్రపంచకప్నకు కొన్ని పోలికలు ఉన్నాయని బాబర్ అన్నాడు. ‘‘ఈ ట్రోఫీని సాధించేందుకు 100 శాతం ప్రయత్నిస్తాం. మాకు ఆరంభం సరిగా లేకపోయినా.. జట్టు అద్భుతంగా పుంజుకొని రావడం ఆనందంగా ఉంది. మా వాళ్లు పులుల్లా పోరాడారు. తుది పోరులోనూ ఇలాగే ప్రయత్నించి కప్ను సాధిస్తాం’’ అని పాక్ సారథి పేర్కొన్నాడు. 1992 ప్రపంచకప్ టోర్నీని కూడా పాకిస్థాన్ జట్టు ఓటమితో ఆరంభించింది. ఆ టోర్నీలోనూ భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఫైనల్కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.