RCB: బెంగళూరు జట్టుకు షాక్.. అప్పటి వరకు కీలక ఆల్రౌండర్ దూరం!
కీలక ఆటగాళ్ల గైర్హాజరీతోనే ఆర్సీబీ (RCB) తన తొలి మ్యాచ్లో ముంబయితో తలపడేందుకు సిద్ధమవుతోంది. హేజిల్వుడ్ ఇప్పటికే దూరం కాగా.. తాజాగా ఆల్రౌండర్ హసరంగ కూడా అందుబాటులో ఉండడని ఆర్సీబీ జట్టు ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ కొన్ని మ్యాచ్లకు దూరమవగా.. తాజాగా టాప్ ఆల్రౌండర్ వహిందు హసరంగ కూడా అదే బాట పట్టాడు. అంతర్జాతీయ షెడ్యూలింగ్ కారణంగా ఐపీఎల్కు అతడు దూరం కావడం ఆర్సీబీకి ఇబ్బందిగా మారింది. ఏప్రిల్ 9 వరకు అందుబాటులో ఉండటం కష్టమని ఆర్సీబీ ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. ఇవాళ ముంబయితో బెంగళూరు తొలి మ్యాచ్ ఆడనుంది. హేజిల్వుడ్ స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ రీస్ టోప్లేను తీసుకున్నట్లు బంగర్ వెల్లడించాడు.
యువ బ్యాటర్ రజత్ పటీదార్ కూడా సగం మ్యాచ్లను ఆడకపోవచ్చని.. అతడి గాయంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు సంజయ్ బంగర్ తెలిపాడు. అయితే, ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ముంబయితో మ్యాచ్లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ స్థానంలో కివీస్ ఆటగాడు బ్రాస్వెల్ను తీసుకుంటున్నట్లు చెప్పాడు. సొంత మైదానంలో ఆడేందుకు ఆటగాళ్లంతా ఉత్సాహంతో ఉన్నారని బంగర్ తెలిపాడు.
ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్, ఫిన్ అలెన్, సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లతో టైటిల్ గెలిచే దిశగా సాగాలని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఫామ్ కొనసాగిస్తే మాత్రం బెంగళూరుకు తిరుగుండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?