PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
రిఫరీ పొరబాటు కారణంగా ఇటీవల బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత పీవీ సింధూ ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటనపై తాజాగా స్పందించిన బ్యాడ్మింటన్ ఆసియా
దిల్లీ: రిఫరీ పొరబాటు కారణంగా ఇటీవల బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత పీవీ సింధూ ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటనపై తాజాగా స్పందించిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్.. ఆ ‘మానవ తప్పిదానికి’ సింధూకు క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరబాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సింధూకు కమిటీ ఛైర్మన్ లేఖ రాశారు.
‘‘ఆసియా ఛాంపియన్షిప్లో మీకు కలిగిన అసౌకర్యానికి మేం క్షమాపణలు తెలియజేస్తున్నాం. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ పొరబాటును సరిదిద్దే అవకాశం లేదు. అయితే భవిష్యత్తులో ఇలాంటి మానవ తప్పిదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఆటల్లో ఇదంతా ఓ భాగమే అని, దాన్ని మీరు అంగీకరిస్తాని విశ్వసిస్తున్నాం’’ అని కమిటీ ఛైర్మన్ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ వివాదం..
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్సీడ్ అకానె యమగూచి చేతిలో సింధు ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తొలి గేమ్ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్లో 14-11తో ఆధిపత్యంలో దూసుకుపోతుండగా.. మ్యాచ్ రిఫరీ యమగూచికి ఒక పాయింట్ కేటాయించాడు. సింధూ సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం స్కోర్ 14-12గా మారడంతో సింధూ రిఫరీతో మాట్లాడింది. యమగూచి సిద్ధంగా లేనందునే తాను సమయం తీసుకున్నానని వివరించే ప్రయత్నం చేసింది. అయినా రిఫరీ వినిపించుకోకుండా యమగూచికి పాయింట్ కేటాయించాడు. ఆ పాయింట్ తర్వాత యమగూచి మ్యాచ్పై పట్టుసాధించి చివరకు 19-21 తేడాతో రెండో గేమ్ను సొంతం చేసుకుంది. మూడో గేమ్ కూడా 16-21 తేడాతో చేజారడంతో సింధూ ఓటమిపాలైంది.
ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ అనంతరం సింధూ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘‘సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో అన్నాడు. అయితే నేను సర్వీస్ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ, రిఫరీ నా మాటలు పట్టించుకోకుండా యమగూచికి పాయింట్ ఇచ్చాడు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం. రెండో గేమ్లో 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. లేదంటే నేను అదే జోరులో 15-11తో విజయానికి చేరువయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్ కోల్పోవడంతో స్కోరు 14-12గా మారింది. ఆమెకు రిఫరీ ఇచ్చిన పాయింట్ న్యాయమైంది కాదు. ఈ మ్యాచ్లో నేను గెలిచి ఫైనల్కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ, అప్పటికే రిఫరీ పాయింట్ ఇచ్చేశాడు కదా అని బదులిచ్చాడు. ఒక చీఫ్ రిఫరీగా అతడు కనీసం ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించాల్సింది’ అని సింధూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సింధూ.. ఆసియా బ్మాడ్మింటన్ ఫెడరేషన్కు ఫిర్యాదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.