Commonwealth Games: కామన్వెల్త్‌ గేమ్స్‌కు భజ్‌రంగ్, రవి దహియా ఎంపిక

 టాప్‌ రెజ్లర్లు భజ్‌రంగ్‌ పునియా, రవి దహియా కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 పోటీలకు ఎంపికయ్యారు. దిల్లీలో జరుగుతున్న...

Published : 17 May 2022 21:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టాప్‌ రెజ్లర్లు భజ్‌రంగ్‌ పునియా, రవి దహియా కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 పోటీలకు ఎంపికయ్యారు. దిల్లీలో జరుగుతున్న ట్రయల్స్‌లో అర్హత సాధించారు. ఇప్పటికే మరో నలుగురు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. నిన్న భారత రెజ్లింగ్‌ జట్టులో సాక్షి మాలిక్‌, వినేశ్‌ చోటు దక్కించుకున్నారు. వీళ్లు ట్రయల్స్‌లో గెలిచి కామన్వెల్త్‌కు అర్హత సాధించారు. ఫైనల్లో సాక్షి 7-1తో మనీషాపై గెలిచింది. వినేశ్‌ (53).. అంతిమ్‌పై గెలిచింది. కామన్వెల్త్‌ క్రీడలు జులై 28 నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా ప్రారంభమవుతాయి. ఆగస్ట్‌ 8వ తేదీ వరకు జరుగుతాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని