Hasaranga : ఉమ్రాన్ బౌలింగ్పై ఎటాక్.. బెంగళూరు ప్రణాళికలేంటో చెప్పిన హసరంగ
ప్రస్తుత టీ20 లీగ్లో అత్యంత వేగవంతమైన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గత రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపడంలేదు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ...
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 లీగ్లో అత్యంత వేగవంతమైన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గత రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన ఉమ్రాన్ వికెట్ తీయకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ను ఎదుర్కోవడంపై తమ జట్టు ప్రణాళికలను బెంగళూరు ఆల్రౌండర్ హసరంగ వెల్లడించాడు. ‘‘ఉమ్రాన్ చాలా వేగంగా బంతులను సంధిస్తాడు. అయితే సరైన లెంగ్త్లో పడితే ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ, ఈ వికెట్ మీద బౌన్స్ లేకపోవడంతో మా బ్యాటర్లు చక్కని షాట్లు కొట్టగలిగారు. ఉమ్రాన్ వేసిన తొలి ఓవర్లోనే 20 పరుగులు రాబట్టారు. దీంతో అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఉమ్రాన్ను ఎటాక్ చేస్తే అతడితోపాటు మిగతా బౌలర్లూ ఒత్తిడికి గురవుతారనేదే మా బ్యాటర్లు ప్రణాళిక. దానిని మైదానంలో అమలు చేయగలిగాం’’ అని వివరించాడు.
ఈ మ్యాచ్లో హసరంగ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. హసరంగ నాలుగు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ‘‘ప్రస్తుతం జట్టులో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా నేను వికెట్ తీయడానికే ప్రయత్నిస్తా. మరీ ముఖ్యంగా మిడిల్ ఓవర్లలోనూ.. కీలకమైన సమయాల్లో వికెట్లు తీస్తే జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యర్థిని ఒత్తిడికి నెట్టే అవకాశం ఉంటుంది’’ అని హసరంగ పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే కుప్పకూలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య