Ind vs Ban: భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బంగ్లా.. కీలక ఆటగాళ్ల రీఎంట్రీ

భారత్‌(Team india)తో జరగనున్న టెస్టు సిరీస్‌(Test series) నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(BCB) జట్టును ప్రకటించింది.

Published : 08 Dec 2022 17:33 IST

చట్టోగ్రామ్‌: భారత్‌(Team india)తో జరగనున్న టెస్టు సిరీస్‌(Test series) నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(Bangladesh cricket board) గురువారం తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. షకిబ్‌ అల్‌ హసన్‌ నేతృత్వంలో 17 మందితో కూడిన ఈ జట్టులో ముష్ఫికర్‌ రహీం, యాసిర్‌ అలీ, తస్కిన్‌ అహ్మద్‌ వంటి కీలక ఆటగాళ్లు తిరిగి చేరనున్నారు. 

‘‘గాయం కారణంగా తొలి టెస్టులో అతడు ఆడటం సాధ్యపడకపోవచ్చునని తెలిపాడు. అయితే, కనీసం రెండో టెస్టుకైనా అతడిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.  అందుకు వైద్య పరీక్షల రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. అందుకే తొలి మ్యాచ్‌ ఆడనున్న జట్టును ప్రకటిస్తున్నాం. టెస్టు జట్టులో స్థానం సంపాదించేందుకు జాకీర్‌ దేశీయ క్రికెట్‌లో ఎంతో కాలంగా నిరూపించుకుంటున్నాడు’’ అంటూ బీసీబీ తెలిపింది. 

బంగ్లా జట్టు: షకిబ్‌ అల్‌ హసన్‌(కెప్టెన్‌), మహముదుల్‌ హసన్‌, నజ్ముల్‌ హొస్సేన్‌, మామినుల్‌ హక్‌, యాసిర్‌ అలీ, ముష్ఫికుర్‌ రహీం,  లిటన్‌ దాస్‌, నురుల్‌ హసన్‌, మెహదీ హసన్‌ మిరాజ్‌, తజ్ముల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌, సయ్యద్‌ ఖాలేద్‌ అహ్మద్‌, ఎబాదత్‌ హొస్సేన్‌, షోరిఫుల్‌ ఇస్లాం. జాకిర్‌ హసన్‌, రెజావుర్‌ రెహమాన్‌ రజా, అనముల్‌ హక్‌ బిజోయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు