Ban vs Ind Live Updates: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియాపై బంగ్లాదేశ్ విజయం
Bangladesh vs India ODI Updates: భారత్తో జరిగిన ఉత్కంఠభరిత వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించింది. భారత్దే మ్యాచ్ అనుకుంటున్న సమయంలో మెహిదీ హసన్ మెరుపు ఇన్నింగ్స్తో మ్యాచ్ను లాగేశాడు.
టీమ్ఇండియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించిది. బంగ్లా బ్యాటర్లలో లిటాన్ దాస్ (41) రాణించగా.. చివర్లో మెహిదీ హసన్ (38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బంగ్లాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం (డిసెంబర్ 7) జరగనుంది.
తొమ్మిదో వికెట్
బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన 39.3 బంతికి హసన్ మహ్మూద్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 41 ఓవర్లకు బంగ్లా స్కోరు 154/9.
రెండు వికెట్లు
బంగ్లాదేశ్ మరోసారి స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ సేన్ వేసిన 38.2 ఓవర్కు హొస్సెన్ (6) బౌండరీ లైన్ వద్ద సిరాజ్కు చిక్కాడు. వన్డేల్లో కుల్దీప్ సేన్కి ఇది మొదటి వికెట్. ఇదే ఓవర్లో ఐదో బంతికి ఎబాదత్ (0) హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. 39 ఓవర్లకు బంగ్లాదేశ్ 135/8.
ఏడో వికెట్
బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ వేసిన 38.2 ఓవర్కు హొస్సెన్ (6) బౌండరీ లైన్ వద్ద సిరాజ్కు చిక్కాడు. వన్డేల్లో కుల్దీప్ సేన్కి ఇది మొదటి వికెట్.
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు
బంగ్లాదేశ్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 34.5 ఓవర్కు మహ్మదుల్లా (14) వికెట్ల ముందు దొరికిపోగా.. సిరాజ్ వేసిన 35.1 ఓవర్కు ముష్పికర్ రహీమ్ (18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.36 ఓవర్లకు బంగ్లాదేశ్ 128/6 స్కోరుతో ఉంది. హసన్ మిరాజ్ (0), హొస్సెన్ (0) క్రీజులో ఉన్నారు.
నిలకడగా బ్యాటింగ్
బంగ్లాదేశ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతున్నారు. చివరి ఐదు ఓవర్లలో 19 పరుగులు రాబట్టారు. 30 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 116/4గా ఉంది. మహ్మదుల్లా (11), ముష్పికర్ రహీమ్ (14) క్రీజులో ఉన్నారు.
బంగ్లాదేశ్కు భారీ షాక్!
బంగ్లాదేశ్కు భారీ షాక్! షాబాజ్ అహ్మద్ వేసిన 23 ఓవర్లో వరసగా రెండు ఫోర్లు బాదిన షకీబ్ అల్ హసన్ (29) ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 23.3 ఓవర్కు విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో షకీబ్ పెవిలియన్ చేరాడు. దీంతో 95 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 25 ఓవర్లో పరుగులేమీ రాలేదు. 25 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ స్కోరు 97/4. ముష్పికర్ రహీమ్ (6), మహ్మదుల్లా (1) క్రీజులో ఉన్నారు.
లిటన్ దాస్ ఔట్
దూకుడు ఆడుతున్న లిటన్ దాస్ (41; 63 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)ని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. 19.2 ఓవర్కు దాస్ కీపర్ కేఎల్ రాహుల్కి చిక్కాడు. దీంతో 74 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లకు బంగ్లాదేశ్ 77/3 స్కోరుతో ఉంది. షకీబ్ అల్ హసన్ (14), ముష్పికర్ రహీమ్ (2) క్రీజులోఉన్నారు.
క్రమంగా జోరు పెంచుతున్న బంగ్లా బ్యాటర్లు
బంగ్లా బ్యాటర్లు క్రమంగా జోరు పెంచుతున్నారు. దీపక్ చాహర్ వేసిన 11 ఓవర్లో ఒక పరుగు రాగా.. కొత్త కుర్రాడు కుల్దీప్ సేన్ వేసిన 12 ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్ వికెట్ కోసం (ఎల్బీడబ్ల్యూ) అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో భారత్ డీఆర్ఎస్ కోరింది. అయితే, ఫలితం టీమ్ఇండియాకు అనుకూలంగా రాలేదు. కుల్దీప్ సేన్ వేసిన 14 ఓవర్లో లిటన్ దాస్ ఏడు పరుగులు రాబట్టాడు. 14 ఓవర్లకు బంగ్లాదేశ్ 48/2 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (22), షకీబ్ అల్ హసన్ (7) క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్
బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ వేసిన 9.1 ఓవర్కు అనాముల్ హక్ (14) వాషింగ్టన్ సుందర్కి చిక్కాడు. 10 ఓవర్లకు బంగ్లాదేశ్ 30/2 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (11), షకీబ్ హల్ అసన్ (4) క్రీజులో ఉన్నారు.
కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్
టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు చేయడానికి బంగ్లాదేశ్ బ్యాటర్లు కష్టపడుతున్నారు. రెండు నుంచి నాలుగు ఓవర్ల మధ్య 10 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో దీపక్ చాహర్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. 5 ఓవర్లకు బంగ్లాదేశ్ 15/1 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (4), అనాముల్ హక్ (11) క్రీజులో ఉన్నారు.
మొదటి బంతికే వికెట్
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే షాక్ తగిలింది. దీపక్చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే నజ్ముల్ హొస్సేన్ (0) రోహిత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్ 5/1 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (0), అనాముల్ హక్ (5) క్రీజులో ఉన్నారు.
టీమ్ఇండియా 186 ఆలౌట్
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్లో వచ్చిన కేఎల్ రాహుల్ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9) నిరాశపర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హల్ అసన్ 5, హొస్సెన్ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు డౌన్..
భారత్ స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. షకీబ్ వేసిన 33వ ఓవర్ మూడో బంతికి వాషింగ్టన్ సుందర్ (19) ఎబాదత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్(2) కూడా 35 ఓవర్ తొలి బంతికి షకీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి దీపక్ చాహర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో అర్ధ శతకంతో కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు.
కేఎల్ రాహుల్ అర్ద శతకం..
బంగ్లాతో తొలి వన్డేలో టాప్ ఆర్డర్ విఫలమైన వేళ.. కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడి అర్ధ శతకం సాధించాడు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన రాహుల్.. ఆ తర్వాత వేగం పెంచాడు. మొత్తం 49 బంతుల్లో 3 సిక్స్లు, 3 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మరో ఎండ్లో సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..
బంగ్లాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఎబాదత్ వేసిన 20వ ఓవర్ చివరి బంతికి నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (24) ముష్ఫికర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడుతున్న రాహుల్, అయ్యర్..
టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆచూతూచి ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ 16, కేఎల్ రాహుల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.
వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్..
భారత్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షకీబ్ వేసిన 11వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ రోహిత్ (27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో బంతికే కోహ్లీ(9) లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
తొలి వన్డేలో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. మెహిదీ హసన్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి ధావన్(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కింగ్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.
నెమ్మదిగా ఆడుతోన్న ఓపెనర్లు..
బంగ్లాతో తొలి వన్డేలో భారత ఓపెనర్లు నెమ్మదిగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12), ధావన్(7) పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్ బ్యాటింగ్ ప్రారంభం..
తొలి వన్డేలో రోహిత్ సేన టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా ధావన్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బంగ్లా వైపు ముస్తాఫిజుర్ బౌలింగ్ ఎటాక్కు దిగాడు.
బంగ్లా జట్టు : లిటన్ దాస్(కెప్టెన్), అనాముల్ హక్, నజ్ముల్ హొస్సేన్, షకిబ్, ముష్ఫికర్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫిఫ్, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మూద్, ముస్తాఫిజుర్, ఎబాదత్ హొస్సేన్.
కుల్దీప్ అరంగేట్రం..
ఈ మ్యాచ్తో వన్డేల్లోకి కుల్దీప్ సేన్ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ అతడికి టీమ్ఇండియా క్యాప్ ఇచ్చి ప్రోత్సహించాడు.
భారత జట్టు ఇదే..
ఢాకా : భారత్తో జరుగుతోన్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇటీవల న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్.. ఈ సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.
ఢాకా : బంగ్లాదేశ్ పర్యటనలో తొలి పోరుకు టీమ్ఇండియా సిద్ధమైంది. రోహిత్ సారథ్యంలోని భారత్.. ఆదివారం మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో బంగ్లాను ఢీకొనబోతోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడిన భారత్.. ఈ పర్యటనలో పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించుతోంది. కెప్టెన్ రోహిత్తో పాటు కోహ్లి, రాహుల్ ఈ సిరీస్కు అందుబాటులోకి వచ్చారు. పొట్టి కప్పులో పేలవ ఫామ్తో విమర్శలెదుర్కొన్న రోహిత్, రాహుల్ బంగ్లాపై చెలరేగిపోతారేమో చూడాలి. భారత తుది జట్టు కూర్పు కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి క్రమంగా ఎదుగుతూ పెద్ద జట్లను తరచుగా ఓడిస్తున్న బంగ్లాను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు