T20 League : 25% ప్రేక్షకులకు మాత్రమే అనుమతి

మార్చి 26 నుంచి మే 29 వరకు దాదాపు రెండు నెలలపాటు జరిగే..

Updated : 26 Mar 2022 16:41 IST

ఇంటర్నెట్ డెస్క్: మెగా టీ20 లీగ్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే కొవిడ్ 19 ప్రోటోకాల్‌ అనుసరించి 25 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మార్చి 26న వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్ ఆరంభం కానుంది. ‘‘అభిమానులను తిరిగి క్రికెట్‌ను ఆస్వాదించేందుకు మైదానంలోకి ఆహ్వానించేందుకు 15వ ఎడిషన్‌ సిద్ధమైంది. చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు స్వాగతం పలకనున్నాం’’ అని పేర్కొంది. 

మార్చి 26 నుంచి మే 29 వరకు దాదాపు రెండు నెలలపాటు మెగా టోర్నీ అలరించనుంది. ముంబయి, పుణెలోని నాలుగు మైదానాల్లో మాత్రమే పోటీలు జరుగుతాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత కోసం దూర ప్రయాణాలు లేకుండా ఈ మేరకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్‌ స్టేడియాల్లో ఇరవై.. బ్రాబోర్నె స్టేడియం, పుణెలోని ఎంఏసీ మైదానాల్లో 15 మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. లీగ్‌ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు నిర్వహించనుంది. ఒక్కో జట్టు లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లను ఆడతాయి. దీని కోసం పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని