T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన

టీ 20 వరల్డ్‌ కప్‌కు భారత్‌ జట్టు ప్రకటన

Updated : 08 Sep 2021 21:50 IST

ముంబయి: అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు టీమిండియా జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. రోహిత్‌ శర్మతో ఎవరు ఓపెనింగ్‌ చేస్తారో వేచి చూడాల్సిందే. మాజీ సారథి ఎంఎస్‌ ధోనీని మెంటార్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. యూఏఈ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లోని మిగతా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఆ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది.

జట్టు వివరాలు ఇవే: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్), ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్‌, రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌, మహ్మద్ షమీ
స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్ ఠాకూర్‌, దీపక్ చాహర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని