Women’s T20 Challenge : మహిళల టీ20 ఛాలెంజ్.. మూడు జట్లకు కెప్టెన్లు ఎవరంటే..?
పురుషుల టీ20 లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో మహిళల టీ20 ఛాలెంజ్ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను...
ముంబయి: పురుషుల టీ20 లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో మహిళల టీ20 ఛాలెంజ్ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మూడు జట్లు మే 23 నుంచి 28 వరకు తలపడతాయి. హర్మన్ ప్రీత్ కౌర్ (సూపర్ నోవాస్), స్మృతీ మంధాన (ట్రయల్బ్లేజర్స్), దీప్తి శర్మ (వెలాసిటీ) నాయకత్వంలోని మూడు టీమ్లను బీసీసీఐ ప్రకటించింది. వెలాసిటీ జట్టుకు గత సీజన్ వరకు మిథాలీరాజ్ కెప్టెన్గా ఉండేది. అయితే ఈసారి మాత్రం దీప్తిశర్మను సారథిగా నియమించింది. ‘‘అత్యుత్తమ మహిళల క్రికెట్ ఛాలెంజ్లో భారత్తోపాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల నుంచి ప్లేయర్లు ఆడతారు. మొత్తం 12 మంది అంతర్జాతీయ క్రీడాకారిణులు మహిళల టీ20 లీగ్ ఛాలెంజ్లో పోటీపడతారు’’ అని బీసీసీఐ వెల్లడించింది.
ప్రతి జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. మహిళల టీ20 ఛాలెంజ్ ఆరంభ మ్యాచ్ ట్రయల్బ్లేజర్స్, సూపర్నోవాస్ జట్ల మధ్య మే 23న ప్రారంభమవుతుంది. అన్ని మ్యాచ్లూ పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరుగుతాయి. మే 24న సూపర్నోవాస్-వెలాసిటీ, మే 26న వెలాసిటీ-ట్రయల్బ్లేజర్స్ మధ్య మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మే 28న బీసీసీఐ నిర్వహించనుంది.
జట్ల వివరాలు:
సూపర్ నోవాస్ : హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భట్, అలానా కింగ్, ఆయుషి సోని, చందు వి, డీంద్ర డాటిన్, హర్లీన్ డియోల్, మేఘ్న సింగ్, మోనిక పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పూనియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లేస్టోన్, సునే లూస్, మాన్సి జోషి
ట్రయల్బ్లేజర్స్ : స్మృతీ మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్, అరుంథతి రెడ్డి, హేలీ మ్యాథ్యూస్, జేమీ రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, రిచా ఘోష్, ఎస్ మేఘన, సాయిఖ్ ఇషాక్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్తర్, సోఫీ బ్రోన్, సుజాత మల్లిక్, ఎస్బీ పోఖర్కర్
వెలాసిటీ : దీప్తి శర్మ (కెప్టెన్), స్నేహ్ రాణా, షఫాలీ వర్మ, ఖాకా, కేపీ నవ్గిరే, క్రాస్, కీర్తి జేమ్స్, లారా వాల్వార్త్, మాయా సోనావానే, నాథకన్ ఛాతమ్, రాధా యాదవ్, ఆర్తి కేదార్, శివాలీ షిండే, సిమ్రన్ బహదుర్, యస్తికా భాటియా, ప్రణవి చంద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..