WPL: షెడ్యూల్ వచ్చేసింది.. ముంబయి-గుజరాత్ మధ్య తొలి సమరం
డబ్ల్యూపీఎల్ (WPL) తొలి సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మార్చి 4 నుంచి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. 23 రోజుల పాటు మొత్తంగా 20 లీగ్ మ్యాచ్లు.. 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల క్రికెట్ లీగ్ (WPL) తొలి సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మార్చి 4 నుంచి మార్చి 25 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ మొదటి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటల నుంచి డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ మార్చి 5న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్-దిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. ఇదే రోజున డీవై పాటిల్ స్టేడియంలో మూడో మ్యాచ్లో యూపీ వారియర్స్-గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.
డబ్ల్యూపీఎల్లో మొత్తం ఐదు జట్లు తలపడనున్నాయి. మొత్తం 23 రోజుల పాటు 22 మ్యాచ్లు జరుగుతాయి. వీటిలో 20 లీగ్ మ్యాచ్లు కాగా, మిగిలిన రెండు ఎలిమినేషన్, ఫైనల్ మ్యాచ్లు. ఎలిమినేషన్ మ్యాచ్ మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో, ఫైనల్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది. లీగ్లో అన్ని మ్యాచ్లు ముంబయిలోనే జరుగుతుండటం గమనార్హం. బీసీసీఐ సోమవారం నిర్వహించిన డబ్ల్యూపీఎల్ వేలం అంచనాలు మించిపోయింది. పురుషుల క్రికెట్కు ఏ మాత్రం తీసిపోకుండా మహిళా క్రికెటర్ల కోసం ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. భారత మహిళా క్రికెటర్లతోపాటు, విదేశీ ఆల్రౌండర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా