Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
క్రికెట్లో పెద్ద దేశాలు ఏదైనా అప్రాధాన్య సిరీస్ ఆడాల్సినపుడు.. ద్వితీయ శ్రేణి జట్లను పంపడం మామూలే. కానీ ఒక దేశం ఒకే సమయంలో వేర్వేరు జట్లతో వేర్వేరు సిరీస్లు ఆడటం మాత్రం అరుదే. భారత క్రికెట్లో రెండేళ్లుగా ఈ ఒరవడి కొనసాగుతోంది. తరచుగా రెండు జట్లను బరిలోకి దించుతోంది.
క్రికెట్లో పెద్ద దేశాలు ఏదైనా అప్రాధాన్య సిరీస్ ఆడాల్సినపుడు.. ద్వితీయ శ్రేణి జట్లను పంపడం మామూలే. కానీ ఒక దేశం ఒకే సమయంలో వేర్వేరు జట్లతో వేర్వేరు సిరీస్లు ఆడటం మాత్రం అరుదే. భారత క్రికెట్లో రెండేళ్లుగా ఈ ఒరవడి కొనసాగుతోంది. తరచుగా రెండు జట్లను బరిలోకి దించుతోంది. అలా అని రెండో జట్టును ‘ద్వితీయ శ్రేణి’ అని తక్కువ చేయలేం. అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లే ఉండటం విశేషం.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది భారత్ (Team India). అయినా బలమైన జట్టుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడించి సిరీస్ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్లకు అందుబాటులో లేని నలుగురు ముఖ్య ఆటగాళ్లు ఈ మ్యాచ్కు అందుబాటులోకి వస్తున్నారు. తొలి రెండు వన్డేల్లో ఆడిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. మూడో వన్డేకు అందుబాటులో ఉండట్లేదు. అతను ఆసియా క్రీడల (Asian Games) కోసం హాంగ్జౌకు వెళ్తున్నాడు. ఆ క్రీడల్లో రుతురాజ్ నాయకత్వంలోనే మరో భారత జట్టు క్రికెట్ పోటీల్లో తలపడబోతోంది. ఆ జట్టులోని అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్.. ఇలా చాలామంది భారత జట్టుకు ఆడిన వాళ్లే. ఎక్కువగా కుర్రాళ్లు ఉన్నారన్న మాటే కానీ.. అందరూ అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టే స్థాయి ఉన్న వాళ్లే. ఇలా ఒకేసారి రెండు అంతర్జాతీయ జట్లను బరిలోకి దించే స్థాయిలో భారత్ ఉందంటే మన క్రికెట్ ప్రమాణాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదే తొలిసారి కాదు
భారత్ ఇలా ఒకేసారి వేర్వేరు జట్లను బరిలోకి దించడం ఇదే తొలిసారి కాదు. రెండు నెలల కిందట ఒక జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. అప్పుడు హార్దిక్ పాండ్య సారథ్యంలో ఓ జట్టు టీ20 సిరీస్ ఆడుతుండగా.. బుమ్రా నాయకత్వంలో మరో జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. గత ఏడాది దక్షిణాఫ్రికాతో ఓ భారత క్రికెట్ జట్టు టీ20 సిరీస్ ఆడింది. అది ముగించుకున్నాక రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు పయనమైంది. కానీ ఆ సిరీస్లో తలపడ్డ దక్షిణాఫ్రికా జట్టుతో వెంటనే శిఖర్ ధావన్ నేతృత్వంలోని మరో భారత బృందం వన్డే సిరీస్ ఆడింది. ఈ రెండు సిరీస్ల్లోనూ భారత్దే విజయం కావడం విశేషం. 2021 నుంచి భారత్ తరచుగా అవసరాన్ని బట్టి రెండో జట్టుతో సిరీస్లు ఆడిస్తోంది. ఆ ఏడాది విరాట్ కోహ్లి సారథ్యంలో ప్రధాన జట్టు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్కు వెళ్లగా.. అదే సమయంలో ధావన్ నాయకత్వంలో మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అక్కడ వన్డే, టీ20 సిరీస్లను సొంతం చేసుకుంది. నిరుడు వెస్టిండీస్లో వన్డే సిరీస్ కోసం కూడా రెండో జట్టును పంపారు.
ఐపీఎల్ పుణ్యం
అంతర్జాతీయ మ్యాచ్ల మోతాదు బాగా పెరిగిపోవడం, దీనికి ఐపీఎల్ కూడా తోడవుతుండడంతో ఒకే జట్టుతో అన్ని సిరీస్లూ ఆడించడమంటే ఆటగాళ్లకు మోయలేని భారమే అవుతుంది. అదే సమయంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎదురు చూస్తున్న ప్రతిభావంతులకు లెక్క లేదు. అందుకే బీసీసీఐ ద్వితీయ జట్టు ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఇది ఉభయతారకంగా పని చేస్తోంది. ప్రపంచంలో మరే దేశానికీ లేనంత క్రికెట్ ప్రతిభ మన దగ్గర ఉందనడంలో సందేహం లేదు. బీసీసీఐ ప్రణాళికాబద్ధమైన కసరత్తు వల్ల.. బలమైన దేశవాళీ వ్యవస్థ, ఐపీఎల్ వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో ప్రతిభ చాటుకున్న కుర్రాళ్లు వేగంగా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. సెలక్టర్లు కూడా కుర్రాళ్లకు భారత జట్టులో ఉదారంగా అవకాశాలు ఇస్తున్నారు. మ్యాచ్లు, సిరీస్ల సంఖ్య పెరగడంతో గతంతో పోలిస్తే ఎక్కువమంది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నారు. ఒకేసారి రెండు కాదు మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్కు ఉందని బ్రయాన్ లారా లాంటి దిగ్గజం వ్యాఖ్యానించడం మన ప్రతిభకు నిదర్శనం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో భారత జట్టు గట్టి పోటీదారుగా బరిలో దిగుతుందని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమ్ఇండియా కేంద్రంగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు. -
India vs Australia: సిరీస్పై భారత్ కన్ను
ప్రపంచకప్ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడుతూ తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన టీమ్ఇండియా.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలన్నదే లక్ష్యం. -
Hardik Pandya: వారసుడు ఇతనేనా?
అతడి కోసం గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ఆల్రౌండర్ను వదులుకుంది. అతడి కోసం రూ.15 కోట్లు చెల్లించింది. -
గుజరాత్ కెప్టెన్గా శుభ్మన్
గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమితుడయ్యాడు. ఈ టీమ్ఇండియా యువ సంచలనం వచ్చే ఏడాది ఐపీఎల్లో టైటాన్స్ను నడిపించనున్నాడు. -
రోహిత్ రాయుడు సెంచరీ వృథా
విజయ్ హజారె ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ నిలువరించింది. -
బంగ్లా - కివీస్ తొలి టెస్టు నేటి నుంచే
సొంతగడ్డపై న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో తలపడేందుకు బంగ్లాదేశ్ సై అంటోంది. మంగళవారం నుంచే తొలి టెస్టు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023- 2025 చక్రంలో ఈ రెండు జట్లకిదే తొలి మ్యాచ్. -
ముంబయితో ఎన్నో జ్ఞాపకాలు
ముంబయి ఇండియన్స్ జట్టుతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, తిరిగి జట్టుతో చేరడం బాగుందని హార్దిక్ తెలిపాడు. 2015లో ముంబయితోనే ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన అతను.. -
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ (Hasan Ali) తన మనసులోని మాటను బయటపెట్టాడు.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
-
Rathika rose: టాప్-5లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి: రతిక
-
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు