T20 League: క్రికెటర్లకు మళ్లీ కాసుల పంట.. ఎప్పుడు ఉండొచ్చంటే?
మరోసారి క్రికెటర్లకు కాసుల వర్షం కురిపించే అవకాశం తలుపు తట్టనుంది. గత సీజన్కు ముందు మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా 2023 సీజన్కు సంబంధించి...
ఇంటర్నెట్ డెస్క్: మరోసారి క్రికెటర్లకు కాసుల వర్షం కురిపించే అవకాశం తలుపు తట్టనుంది. గత సీజన్కు ముందు మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా 2023 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మూడో వారం (16వ తేదీగా అంచనా) ఆరంభంలో ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలతో బీసీసీఐ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇది మినీ-వేలంగా నిర్వహించే అవకాశం ఉంది. అయితే ప్రతి ఫ్రాంచైజీ రూ. 95 కోట్లతో వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. గత మెగా ఆక్షన్ కంటే రూ. 5 కోట్లు అధికం కావడం గమనార్హం. భారత టీ20 లీగ్ 2022 సీజన్కు ముందు రెండు రోజులపాటు సాగిన మెగా వేలంలో క్రికెటర్లకు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (రూ.15.25 కోట్లు) బంపర్ ఆఫర్ కొట్టాడు.
మినీ-వేలం సందర్భంగా తమ జట్టులోని ఆటగాళ్లను ఫ్రాంచైజీలు మార్చుకోవడం లేదా అమ్ముకోవడం చేసేందుకు అవకాశం కూడా ఉంటుందని సమాచారం. గత సీజన్ తర్వాత చెన్నై జట్టు రవీంద్ర జడేజాను విడిచి పెట్టి గుజరాత్ నుంచి శుభ్మన్ గిల్ను తెచ్చుకుంటుందనే రూమర్లు వచ్చాయి. అయితే వీటిని రెండు ఫ్రాంచైలు కొట్టిపడేశాయి. జడేజా కోసం గుజరాత్ మాత్రమే కాకుండా ఇతర జట్లూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చెన్నై మాత్రం ఇలాంటి వార్తలను ఖండిస్తూ.. టాప్ ఆల్రౌండర్ను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే భారత టీ20 లీగ్ వచ్చే సీజన్ను ‘‘ఇంటా-బయటా’ పద్ధతిలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు. అక్టోబర్ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) అనంతరం మినీ-వేలం గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్