Ganguly: నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది
దక్షిణాఫ్రికా పర్యటన ప్రస్తుతానికి తమ షెడ్యూలు లోనే ఉందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. కొవిడ్-19 కొత్త వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపాడు. ‘‘ప్రస్తుతానికైతే
దక్షిణాఫ్రికా పర్యటనపై గంగూలీ
కోల్కతా: దక్షిణాఫ్రికా పర్యటన ప్రస్తుతానికి తమ షెడ్యూలు లోనే ఉందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. కొవిడ్-19 కొత్త వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపాడు. ‘‘ప్రస్తుతానికైతే దక్షిణాఫ్రికా పర్యటన ఉంది. పర్యటనపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది. మొదటి టెస్టు డిసెంబరు 17న ఆరంభమవుతుంది’’ అని గంగూలీ చెప్పాడు. ‘‘ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యానికే బీసీసీఐ ప్రాధాన్యత. అందుకోసం చేయాల్సిందంతా చేస్తాం. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం’’ అని అన్నాడు. టీమ్ఇండియా డిసెంబరు 8 లేదా 9న దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరాల్సివుంది.
టీమ్ఇండియాకు పటిష్టమైన బుడగ.. దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ: దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చే టీమ్ఇండియాకు అత్యంత పటిష్టమైన బయో బబుల్ ఏర్పాటు చేస్తామని ఆ దేశ విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చినా ఇండియా-ఎ పర్యటనను కొనసాగిస్తున్నందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పింది. ‘‘టీమ్ఇండియా భద్రత, ఆరోగ్యం కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు దక్షిణాఫ్రికా తీసుకుంటుంది. దక్షిణాఫ్రికా, ఇండియా-ఎ జట్లతో పాటు రెండు జాతీయ జట్లకు పటిష్టమైన పూర్తిస్థాయి బయో సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం. తమ సరిహద్దులు మూసేస్తూ, ప్రయాణాలు పరిమితం చేస్తున్న అనేక దేశాల కంటే భారత్ భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఇండియా-ఎ పర్యటనను కొనసాగించడం ద్వారా సంఘీభావం ప్రకటించింది. బీసీసీఐకి దక్షిణాఫ్రికా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టీమ్ఇండియా సిరీస్తో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్లో 30వ పునరాగమన వార్షికోత్సవం జరుపుకోనుంది. 1970లో అప్పటి ప్రభుత్వ వర్ణ వివక్ష కారణంగా దక్షిణాఫ్రికాపై ఐసీసీ నిషేధం విధించింది. 1991లో నిషేధకాలం పూర్తి చేసుకున్న దక్షిణాఫ్రికాకు ఆతిథ్యమిచ్చిన తొలి దేశం భారతే. 2022 జనవరి 2న కేప్టౌన్లో జరిగే స్మారక కార్యక్రమం ద్వారా వార్షికోత్సవం జరుగుతుంది’’ అని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్