Asia cup : ఆసియా కప్ నిర్వహణపై ఇప్పుడే మాట్లాడటం తగదు..!
శ్రీలంక వేదికగా ఆగస్టులో ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతోపాటు...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందన
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక వేదికగా ఆగస్టులో ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే లంక అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తీవ్ర స్థాయిలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్ నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రెండు రోజుల కిందట వరకు శ్రీలంకలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటించింది. టీ20, వన్డే, టెస్టు సిరీస్లను ఆడింది. దీంతో క్రికెట్ మ్యాచ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పక చెప్పినట్లు అయింది. ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. శ్రీలంకలో పరిస్థితులపై బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపాడు.
‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. భారత్ ఆతిథ్యం ఇవ్వగలదా..? లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేం. అయితే శ్రీలంకలో పరిస్థితులను మాత్రం పరిశీలిస్తున్నాం. ఆసీస్ ఇప్పటికే అక్కడ ఆడింది. శ్రీలంక క్రికెట్ జట్టు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆతిథ్యం ఇచ్చింది. అందుకే ఇప్పుడే ఏం మాట్లాడలేను. ఆసియా కప్నకు కనీసం నెల రోజుల సమయం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం’’ అని గంగూలీ వివరించాడు.
అప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా..
‘‘కొవిడ్ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నా. అయితే క్రికెట్ టోర్నమెంట్లను చాలా చక్కగా నిర్వహించాం. అదేవిధంగా టీ20 లీగ్ మీడియా హక్కులకు భారీ మొత్తం దక్కేలా చేయగలిగాం. అయితే ఆటకు, డబ్బుకు ముడి పెట్టను. అయితే సంపద సృష్టి మాత్రం మంచిదే. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పనకు ఎలాంటి అవాంతరాలు ఉండవు. ఇప్పుడు భారత క్రికెట్ పటిష్ట స్థానంలో ఉంది. దీనిని మేం ప్రారంభించినా.. ఆటగాళ్లు, పాలనాయంత్రాంగం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ప్రతిసారీ ఐసీసీ టోర్నమెంట్లను మనమే గెలవలేము. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచకప్ సెమీస్లో ఓటమి పాలయ్యాం. ఇది సరైన ప్రదర్శన కాదనే అంచనా వేయడం తప్పవుతుంది. టీమ్ఇండియా మీద భారీగా అంచనాలు ఉంటాయి. వాటిని తట్టుకొని విజయాలు సాధించడం తేలికేమీ కాదు. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు’’ అని గంగూలీ స్పష్టం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు