2021-22 దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ విడుదల
2021-22 దేశవాళీ క్రికెట్కు సంబంధించి బీసీసీఐ తాజాగా షెడ్యూల్ ఖరారు చేసింది. సెప్టెంబర్ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ఈ సీజన్ను ప్రారంభించాలని నిర్ణయించింది...
దిల్లీ: 2021-22 దేశవాళీ క్రికెట్కు సంబంధించి బీసీసీఐ తాజాగా షెడ్యూల్ ఖరారు చేసింది. సెప్టెంబర్ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ఈ సీజన్ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ తర్వాత డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు రంజీ ట్రోఫీ నిర్వహించాలని చూస్తోంది. గతేడాది కరోనా వైరస్ కారణంగా దేశవాళీ క్రికెట్లో అత్యంత ముఖ్యమైన రంజీ ట్రోఫీని నిర్వహించలేకపోవడం విదితమే. 87 ఏళ్లలో తొలిసారి ఇలా జరిగింది. దానికి బదులు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20, విజయ్ హజారె వన్డే ట్రోఫీలను నిర్వహించింది. అయితే ఈ సీజన్లో రంజీ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఈ సీజన్లో దులీప్ ట్రోఫీ, దియోధర్ ట్రోఫీ, ఇరానీ కప్ టోర్నీలకు అవకాశం ఇవ్వలేదు. అలాగే ఐదు మహిళల ఈవెంట్లను కూడా రద్దు చేసిందని సమాచారం. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రమైన నేపథ్యంలోనూ బీసీసీఐ అన్ని వయసుల వారికి మ్యాచ్లు నిర్వహించాలని చూస్తోంది. గతేడాది మహిళల క్రికెట్కు విరామం ఇచ్చిన నేపథ్యంలో, ఈసారి వారికి కూడా పలు టోర్నీలు నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్, అక్టోబర్ మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబర్లో విజయ్ హజారే ట్రోఫీ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక డిసెంబర్ నుంచి మార్చి వరకు రంజీ ట్రోఫీ కొనసాగించాలని భావిస్తోంది.
* సీనియర్ పురుషుల విభాగం
సయ్యద్ ముస్తాక్ అలీ (టీ20) - సెప్టెంబర్ అక్టోబర్ మధ్య
విజయ్ హజారె ట్రోఫీ (వన్డే) - నవంబర్
రంజీ ట్రోఫీ (ఫస్ట్క్లాస్) - డిసెంబర్21 - మార్చి22
* అండర్-23 పురుషుల విభాగం
నేషనల్ అండర్-23 వన్డే మ్యాచ్లు - అక్టోబర్ - నవంబర్ మధ్య
సీకే నాయుడు ట్రోఫీ - డిసెంబర్21 - మార్చి22
* అండర్-19 బాయ్స్
వినో మన్కడ్ (వన్డే) - అక్టోబర్
అండర్-19 వన్డే ఛాలెంజర్ - నవంబర్
కూచ్ బిహార్ ట్రోఫీ - నవంబర్ 21 - జనవరి22
* అండర్-16 బాయ్స్
విజయ్ మర్చంట్ ట్రోఫీ - అక్టోబర్ - డిసెంబర్
* సీనియర్ మహిళల విభాగం
సీనియర్ మహిళల టీ20 లీగ్ - అక్టోబర్
సీనియర్ మహిళల వన్డే లీగ్ - నవంబర్
* అండర్-23 మహిళల విభాగం
మహిళల అండర్-23 టీ20 లీగ్ - డిసెంబర్
మహిళల అండర్-23 వన్డే లీగ్ - జనవరి22
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!