WTC Finals: ‘కోహ్లీసేన’ పరుగులు ప్రారంభం..

టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా మళ్లీ కలుసుకున్నారు. రెండు వారాల కఠిన క్వారంటైన్‌ అనంతరం అంతా కలిసి జిమ్‌లో చెమటోడ్చారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిశాక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పాల్గొన్న వారంతా టోర్నీ వాయిదా పడటంతో కుటుంబ సభ్యులతో...

Published : 01 Jun 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా మళ్లీ కలుసుకున్నారు. రెండు వారాల కఠిన క్వారంటైన్‌ అనంతరం అంతా కలిసి జిమ్‌లో చెమటోడ్చారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిశాక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పాల్గొన్న వారంతా టోర్నీ వాయిదా పడటంతో కుటుంబ సభ్యులతో కలిసి కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చేనెలలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడేందుకు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో రెండు వారాల క్రితం ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్లో కఠిన క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు అంతా కలిసి జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు.

అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, పుజారా, రవీంద్ర జడేజా, రిషభ్‌ పంత్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మయాంక్‌ అగర్వాల్‌ లాంటి కీలక ఆటగాళ్లంతా సోమవారం తమ సన్నద్ధం ప్రారంభించారు. టీమ్‌ఇండియా స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ సోహం దేశాయి నేతృత్వంలో పలు వర్కవుట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని