WTC Finals: ‘కోహ్లీసేన’ పరుగులు ప్రారంభం..
టీమ్ఇండియా ఆటగాళ్లంతా మళ్లీ కలుసుకున్నారు. రెండు వారాల కఠిన క్వారంటైన్ అనంతరం అంతా కలిసి జిమ్లో చెమటోడ్చారు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ముగిశాక ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొన్న వారంతా టోర్నీ వాయిదా పడటంతో కుటుంబ సభ్యులతో...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఆటగాళ్లంతా మళ్లీ కలుసుకున్నారు. రెండు వారాల కఠిన క్వారంటైన్ అనంతరం అంతా కలిసి జిమ్లో చెమటోడ్చారు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ముగిశాక ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొన్న వారంతా టోర్నీ వాయిదా పడటంతో కుటుంబ సభ్యులతో కలిసి కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చేనెలలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఆడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో రెండు వారాల క్రితం ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో కఠిన క్వారంటైన్లోకి వెళ్లారు. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు అంతా కలిసి జిమ్లో వర్కవుట్లు చేస్తున్నారు.
అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ట్విటర్లో అభిమానులతో పంచుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె, పుజారా, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మయాంక్ అగర్వాల్ లాంటి కీలక ఆటగాళ్లంతా సోమవారం తమ సన్నద్ధం ప్రారంభించారు. టీమ్ఇండియా స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహం దేశాయి నేతృత్వంలో పలు వర్కవుట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.