BCCI: సెలక్టర్లకు ఉద్వాసన.. చేతన్ బృందంపై బీసీసీఐ వేటు
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ముందుగా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి బోర్డు ఉద్వాసన పలికింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్లో భారత్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.
దిల్లీ: టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ముందుగా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి బోర్డు ఉద్వాసన పలికింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్లో భారత్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుతో పాటు గత ఏడాది టీ20 ప్రపంచకప్లో సెమీస్ కూడా చేరలేకపోయిన భారత బృందాన్ని ఎంపిక చేసింది కూడా ఈ కమిటీనే. ఇందులో చేతన్తో పాటు హర్విందర్ సింగ్, సునీల్ జోషి, దేబశిష్ మొహంతి ఉన్నారు. కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానించింది. దీనికి గడువు ఈ నెల 28. త్వరలోనే జట్టులోనూ పెద్ద మార్పులు ఉండబోతున్నాయనడానికి సెలక్షన్ కమిటీపై వేటు సూచికగా కనిపిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్బాస్’ చూడొద్దు: హైకోర్టు
-
General News
Tirumala: వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం
-
Politics News
Andhra News: యువగళం.. వారాహి యాత్రల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుంది: ఎంపీ రఘురామ
-
Crime News
Andhra News: అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు