IPL: ఐపీఎల్‌ జట్లు విదేశాల్లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడాలి

విదేశాల్లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలను బీసీసీఐ అనుమతించాల్సిన సమయం ఆసన్నమైందని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నాడు. ఈ మ్యాచ్‌ల వల్ల ఐపీఎల్‌ మరింత

Updated : 24 Nov 2021 07:39 IST

దిల్లీ: విదేశాల్లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలను బీసీసీఐ అనుమతించాల్సిన సమయం ఆసన్నమైందని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నాడు. ఈ మ్యాచ్‌ల వల్ల ఐపీఎల్‌ మరింత బలోపేతమవుతుందని చెప్పాడు. ‘‘సీజన్‌ లేనప్పుడు భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మ్యాచ్‌లు ఆడేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు అనుమతి ఇచ్చే అంశాన్ని బీసీసీఐ పరిశీలించాలి. ఇలా ఆడడం వల్ల ఐపీఎల్‌ మరింత బలపడుతుంది. ఆటగాళ్ల అందుబాటును బట్టి ఏటా మూడు లేదా అయిదు మ్యాచ్‌లు ఆడొచ్చు’’ అని అన్నాడు. రెండు కొత్త ఫ్రాంఛైజీలకు భారీ ధర పలకడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని చెప్పాడు. లీగ్‌కు ఆ అర్హత ఉందని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని