Virat Kohli : విరాట్ కోహ్లీ ల్యాండ్మార్క్ టెస్టుపై.. దిగ్గజ ఆటగాళ్లు ఏమన్నారంటే.!
వందో టెస్టు ఆడనున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. టెస్టు క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకోనున్న కోహ్లీ గురించి, అతడు సాధించిన..
ఇంటర్నెట్ డెస్క్: వందో టెస్టు ఆడనున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. టెస్టు క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకోనున్న కోహ్లీ గురించి, అతడు సాధించిన విజయాలు, భారత క్రికెట్పై అతడి ప్రభావం తదితర విషయాల గురించి.. పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ తదితరులు.. కోహ్లీపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు, 28 అర్ధ శతకాలు ఉన్నాయి. మార్చి 4 నుంచి మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగనున్న తొలి టెస్టు అతడికి వందోది కానుంది. దీంతో కోహ్లీ కెరీర్లో ఇదో మైలురాయిగా నిలవనుంది. అయితే, తొలుత ఈ మ్యాచ్కు కరోనా కారణంగా ప్రేక్షకులను అనుమతించరనే వార్తలు వచ్చినా బీసీసీఐ ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీకి అంగీకరించింది. కానీ, టీమిండియా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది.
దిగ్గజాల శుభాకాంక్షలు..
* నీ గురించి నేను తొలిసారి విన్నది 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో. అప్పుడు మీరు మలేసియాలో అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్నారు. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్లో పలువురు ఆటగాళ్లు నీ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆటగాడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. వాడి బ్యాటింగ్ చూడాలని చెప్పారు. బరిలోకి దిగి బాగా ఆడు. ఆల్ ది బెస్ట్. -సచిన్ తెందూల్కర్.
* ఒక టెస్టు ఆడటమే గొప్ప. ఇక వంద టెస్టులు ఆడటమనేది ఇంకా గొప్ప ఘనత. ఈ విషయంలో కోహ్లీ సాధించిన దానికి గర్వంగా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. వందో టెస్టును ఆస్వాదించు. -రాహుల్ ద్రవిడ్.
* కోహ్లీ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని అత్యున్నత శిఖరాలకు చేరాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా, టీమ్ఇండియా మాజీ సారథిగా, 100 టెస్టుల ఆడిన ఆటగాడిగా అతడికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. -సౌరభ్ గంగూలీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు