పంత్ వల్లే నాపై నిందలు: అశ్విన్
వికెట్కీపర్ రిషభ్పంత్ వల్లే డీఆర్ఎస్లు వృథా అవుతున్నాయని టీమ్ఇండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. తననెప్పుడూ పంత్ నిరాశ పరుస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. సమీక్షల్లో వైఫల్యాలపై ప్రశ్నించగా అతడిలా నవ్వుతూ బదులిచ్చాడు. ఇండియాటుడే సదస్సులో యాష్...
డీఆర్ఎస్ వైఫల్యాలపై సరదా జవాబు
ఇంటర్నెట్ డెస్క్: వికెట్కీపర్ రిషభ్పంత్ వల్లే డీఆర్ఎస్లు వృథా అవుతున్నాయని టీమ్ఇండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. తననెప్పుడూ పంత్ నిరాశ పరుస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. సమీక్షల్లో వైఫల్యాలపై ప్రశ్నించగా అతడిలా నవ్వుతూ బదులిచ్చాడు. ఇండియాటుడే సదస్సులో యాష్ మాట్లాడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశమిస్తే కచ్చితంగా రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. వచ్చిన అవకాశాలను గొప్పగా మలచుకోవడమే తనకిష్టమని పేర్కొన్నాడు.
2018 నుంచి ఇప్పటి ఇంగ్లాండ్ సిరీస్ వరకు అశ్విన్ 19 మ్యాచులు ఆడాడు. అతడి బౌలింగ్లో టీమ్ఇండియా 20 సమీక్షలు కోరింది. అందులో నాలుగు తలకిందులయ్యాయి. ఐదు అంపైర్ కాల్స్గా ప్రకటించారు. 11 వృథాగా మారాయి. ఇక ఇంగ్లాండ్ సిరీసులో 10 సమీక్షలు కోరగా ఒకటి మాత్రమే సరైంది. 9 విఫలమయ్యాయి. అందులో ఒకటి అంపైర్ కాల్ కావడం గమనార్హం.
‘డీఆర్ఎస్ అంశంలో నన్ను చూసే దృష్టికోణం మారాలి! ఎందుకంటే కొన్నిసార్లు అవతలివారు చెప్పింది సరికాదేమో. ఇంగ్లాండ్ సిరీస్కు ముందు నా డీఆర్ఎస్లు చాలా బాగుండేవి. కానీ డీఆర్ఎస్లు తీసుకొనేటప్పుడు కీపర్పై ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే బంతి సరైన ప్రాంతంలో పడిందా?విసిరిన కోణం బాగుందా? వికెట్లను తాకగలదా? అనే విషయంలో కీపర్ సాయం అవసరం. కానీ చాలా సందర్భాల్లో రిషభ్ నన్ను నిరాశ పరుస్తాడు (నవ్వుతూ)! అందుకే మేమిద్దరం డీఆర్ఎస్పై క్రాష్ కోర్సు చేయాలి. ఎందుకంటే రవిభాయ్కు ఈ విషయంలో నాపై ఫిర్యాదులున్నాయి’ అని యాష్ అన్నాడు. ఏదేమైనా డీఆర్ఎస్ల అంశంలో మెరుగవ్వాల్సిన అవసరమైతే ఉందని అశ్విన్ తెలిపాడు. భవిష్యత్తులో సమీక్షలు కోరేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ గురించి ప్రశ్నించగా తనకు దొరికిన ప్రతి అవకాశాన్నీ గొప్పగా మలచుకుంటానని అశ్విన్ స్పష్టం చేశాడు. ‘నేను ప్రశాంతంగా ఉన్నాను. నాతో నేనే పోటీ పడుతున్నాను. అందుకే తెలుపు బంతి క్రికెట్పై ప్రశ్నలు అడిగినప్పుడు నవ్వొస్తుంది. ఎందుకంటే నాకొచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోవడమే నాకిష్టం. వాటి పట్ల సంతోషంగా ఉన్నాను. అందుకే ఇతరుల అభిప్రాయలకు ఆందోళన చెందను. ఆడిన ప్రతి మ్యాచులో నా ప్రదర్శనతో అవతలివారి మోములో చిరునవ్వులు తెప్పించేందుకే ప్రయత్నిస్తాను’ అని యాష్ తెలిపాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ బాగా ఆడుతుండటంతో యాష్కు అవకాశం ఇవ్వడం లేదని కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!