Beijing Olympics: బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 45 కొత్త కరోనా కేసులు

చైనాలో ప్రారంభమైన బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో తాజాగా 45 కరోనా కేసులు నమోదైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో 26 మంది కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా...

Updated : 05 Feb 2022 14:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో ప్రారంభమైన బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో తాజాగా 45 కరోనా కేసులు నమోదైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో 26 మంది కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా, మిగతా వారు ఇప్పటికే అక్కడికి చేరుకున్న అథ్లెట్లతో పాటు, అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుత కేసుల సంఖ్య అదుపులోనే ఉందని, తాము ఊహించినదానికంటే ఎక్కువ కాదని నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం జనవరి 23 నుంచి మొత్తం 12 వేల మంది అథ్లెట్లు, వారి సిబ్బంది విదేశాల నుంచి చైనాలో అడుగుపెట్టారు. అందులో మొత్తం 353 కరోనా కేసులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు. మరోవైపు ఈ వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం భారత్‌ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్‌ ఖాన్‌ పాల్గొంటున్నాడు. ఇప్పటికే అతడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం జాతీయ జెండాను చేతబూని స్టేడియంలో భారత బృందాన్ని ముందుకు నడిపించాడు. అతడు స్లాలోమ్‌, జెయింట్‌ స్లాలోమ్‌ విభాగాల్లో స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొననున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని