Ben Stokes: బెన్ స్టోక్స్కు చెన్నై పగ్గాలు..?
ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఒకడు. చెన్నై అతడిని ఏకంగా రూ.16.25కోట్లకు దక్కించుకుంది. మరి భవిష్యత్తులో అతడు చెన్నై పగ్గాలు అందుకుంటాడా?
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes)ను చెన్నై ఏకంగా రూ.16.25కోట్లకు దక్కించుకుంది. ఆ జట్టు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆటగాడు ఇతడే. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు సారథిగా ఉన్న స్టోక్స్.. భవిష్యత్తులో చెన్నై (Chennai) పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిస్ కూడా దీనిపై స్పందించాడు. వచ్చే లీగ్ సీజన్లోనే ధోనీ (Dhoni) నుంచి స్టోక్స్.. కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవచ్చని అంచనా వేశాడు.
‘‘అతడే(స్టోక్స్) చెన్నై కెప్టెన్ అవుతాడని అనిపిస్తోంది. గతంలో(గత సీజన్ను ఉద్దేశిస్తూ) ఎంఎస్ ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను మరొకరికి అప్పగించాడు. ఐపీఎల్ సీజన్ల మధ్యలో ధోనీ పెద్దగా మ్యాచ్లు ఆడట్లేదు. రాబోయే సీజన్లోనూ కెప్టెన్సీని అప్పగించేందుకు ధోనీకి స్టోక్స్ రూపంలో అవకాశం వచ్చింది. అదే జరిగితే స్టోక్స్ తదుపరి కెప్టెన్ అవుతాడు’’ అని ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
గత సీజన్కు ముందు ధోనీ (Dhoni).. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై పగ్గాలను భారత ఆల్రౌండర్ జడేజాకు అప్పగించారు. కానీ, జడేజా సారథ్యంలో చెన్నై జట్టుకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో సీజన్ మధ్యలో అతడిని తప్పించి.. తిరిగి ధోనీనే కెప్టెన్ చేశారు.
ఇక.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లాండ్ (England) ఛాంపియన్గా నిలవడంతో.. ఐపీఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్కరన్ ఏకంగా రూ.18.5 కోట్లతో ఐపీఎల్ (IPL Auction 2023) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. స్టోక్ కూడా రూ.16.25కోట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ విజయంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM