IND vs SL : భారత్-లంక రెండో టెస్టు పిచ్కు ‘బిలో యావరేజ్’ రేటింగ్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్కు...
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దారుణమైన రేటింగ్ను ఇచ్చింది. ఇటీవల చిన్నస్వామి స్టేడియం వేదికగానే భారత్-శ్రీలంక జట్ల మధ్య గులాబీ బంతి టెస్టు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పిచ్కు సంబంధించిన నివేదికను మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఐసీసీకి సమర్పించారు. శ్రీనాథ్, ఐసీసీ ప్రకటన ప్రకారం.. ‘‘చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్కు ఉపయోగించిన పిచ్ మొదటి రోజు నుంచే టర్నింగ్ ట్రాక్గా మారింది. రోజులు గడిచే కొద్దీ మార్పులు వస్తున్నప్పటికీ.. బ్యాట్, బంతికి మధ్య సరైన పోటీ లేదనిపించింది. అందుకే పిచ్ రేటింగ్ను ‘బిలో యావరేజ్’గా పేర్కొన్నాం’’ అని శ్రీనాథ్ వెల్లడించాడు. ఐసీసీకి సమర్పించిన నివేదికను బీసీసీఐకి పంపినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా పిచ్, అవుట్ ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ కింద చిన్నస్వామి స్టేడియానికి ఒక డిమెరిట్ పాయింట్ను ఐసీసీ విధించింది.
భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన డే/నైట్ టెస్టు మూడు రోజుల్లోపే ముగిసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకే పరిమితమైంది. అయితే బుమ్రా (5/24) టర్నింగ్ డెలివరీలకు లంక 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 303/9 స్కోరు వద్ద టీమ్ఇండియా డిక్లేర్డ్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలోనూ అశ్విన్ (4/55), బుమ్రా (3/23) దెబ్బకు లంక 208 రన్స్కే ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి