ఐపీఎల్లో ఉత్తమ ఆల్రౌండర్లు వీరే!
వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఏ ఫార్మాట్ అయినా ఆల్రౌండర్లదే కీలకపాత్ర. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవులుగా మారి మ్యాచ్లను...
ఇంటర్నెట్ డెస్క్: వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఏ ఫార్మాట్ అయినా ఆల్రౌండర్లదే కీలకపాత్ర. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవులుగా మారి మ్యాచ్లను మలుపు తిప్పుతారు. మెరుపు వేగంతో కదులుతూ అద్భుతమైన క్యాచులు ఒడిసిపడతారు. చిరుతలా పరుగెత్తుతూ రనౌట్లు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి జట్టులో కనీసం నలుగురు లేదా అయిదుగురు ఆల్రౌండర్లు ఉన్నారు. వీరిలో కొంతమంది మాత్రమే నిలకడైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో ఉన్న అత్యుత్తమ ఆల్రౌండర్లు ఎవరో తెలుసుకుందాం!
1.కీరన్ పొలార్డ్
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్రౌండర్లలో పొలార్డ్ ఒకడు. అందుకు అతడు పట్టే క్యాచులే నిదర్శనం. అలాగే క్రీజులో కుదురుకున్నాడంటే భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టించడం అతడి నైజం. 2009లో జరిగిన ఛాంపియన్స్ లీగ్లో ట్రినిడాడ్ అండ్ టుబాగో తరఫున మంచి ప్రదర్శన కనబరచడంతో 2010లో ముంబయి ఇండియన్స్ పొలార్డ్ను తీసుకుంది. అప్పటి నుంచి ఆ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి ముంబయికి విజయాలందించాడు ఈ కరీబియన్ ప్లేయర్. ఐపీఎల్లో అతడి గణాంకాలు పరిశీలిస్తే.. 164 మ్యాచుల్లో 149.87 స్ట్రెక్రేట్తో 29.93 సగటు సాధించి 3,023 పరుగులు సాధించాడు. అలాగే బౌలింగ్లోనూ 60 వికెట్లు పడగొట్టాడు. దీంతోనే అతడు ఆ జట్టుకు ఎంత విలువైన ఆటగాడో స్పష్టమవుతోంది. కొన్ని సార్లు ముంబయికి కెప్టెన్గానూ వ్యవహరించాడు.
2. డ్వాన్ బ్రావో
వికెట్ తీయగానే డ్యాన్స్ చేస్తూ సంబరాల్లో మునిగితేలే డ్వాన్ బ్రావో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. బ్రావో ఐపీఎల్ మొదటి మూడు సీజన్లలో ముంబయి ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. మోర్కెల్, రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్లు ఆ జట్టులో ఉన్నా 2011లో ఇతడిని సీఎస్కే కొనుగోలు చేసింది. కెప్టెన్ కూల్ ఎం.ఎస్ ధోనీ సారథ్యంలో బ్రావో మంచి ఆల్రౌండర్గా తయారయ్యాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఈ కరీబియన్ క్రికెటర్ మంచి మ్యాచ్ఫినిషర్ కూడా. అలాగే డెత్ ఓవర్లలో తక్కువ వేగంతో వైవిధ్యమైన బంతులు వేస్తూ బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెడతాడు. రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు తీసిన బౌలర్)ను సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద 140 ఐపీఎల్ మ్యాచ్లాడిన ఈ విండీస్ ప్లేయర్.. 128.22 స్ర్టెక్రేట్తో 1,490 పరుగులు చేశాడు. అలాగే153 వికెట్లు పడగొట్టి బౌలింగ్లోనూ సత్తాచాటాడు.
3.షేన్ వాట్సన్
ఐపీఎల్లో ఉన్న అత్యుత్తమ ఆల్రౌండర్లలో షేన్ వాట్సన్ ఒకడు. భీకరమైన షాట్లు ఆడుతూ ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించే ఈ ఆసీస్ ప్లేయర్ బంతితోనూ రాణిస్తాడు. ఐపీఎల్ మొదలైనప్పటి 2008 నుంచి 2015 వరకు రాజస్థాన్ తరఫున ఆడిన అతడు.. ఆరంభ సీజన్లో ఆ జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2014, 2015లో కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఇక 2016, 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2018లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని సొంతం చేసుకోగా ఆ సీజన్లో అదరగొట్టాడు. 2 సెంచరీలు బాదాడు. అలా 2018లో చెన్నై విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. చివరగా గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్లో వాట్సన్ చివరిసారి ఐపీఎల్ ఆడాడు. అక్కడ జట్టు పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సన్ మెగా ఈవెంట్కు రిటర్మైంట్ ప్రకటించాడు. అతడి ఐపీఎల్ గణాంకాలు పరిశీలిస్తే.. 31 సగటుతో 3,874 పరుగులు సాధించాడు. అలాగే 7.9 ఎకానమీతో 92 వికెట్లు పడగొట్టాడు.
4.రవీంద్ర జడేజా
మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయడంతోపాటు కష్టసాధ్యమైన క్యాచులను సైతం సునాయసంగా అందుకోవడంలో రవీంద్ర జడేజా దిట్ట. 2008 నుంచి 2010 వరకు రాజస్థాన్ తరపున ఆడిన జడ్డూ.. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ప్రాతినిధ్యం వహించి మెరుగైన ప్రదర్శన చేశాడు. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్తో రాణించి తన సత్తా చాటాడు. ఈ క్రమంలోనే 184 మ్యాచులడిన జడ్డూ.. 2,159 పరుగులు చేయడంతోపాటు 7.67 ఎకానమీతో 114 వికెట్లు పడగొట్టాడు.
5.హార్దిక్ పాండ్యా
2015లో ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్య..వచ్చిరావడంతోనే మెరుపులు మెరిపించాడు. ఈ సీజన్లో చెన్నైతో జరిగిన మ్యాచ్లో క్లిష్టమైన లక్ష్యఛేదనలో కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత వాంఖడే స్టేడియంలో కోల్కతాతో తలపడిన మ్యాచ్లో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సూచనలు పాటిస్తూ బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చే బరోడా క్రికెటర్.. ఇప్పటివరకు ఐపీఎల్లో 159.26 స్ట్రెక్రేట్తో 1,349 పరుగులు చేశాడు. అలాగే 42 వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM