GT vs CSK: గుజరాత్పై చెన్నై విక్టరీ.. స్పెషల్ మూమెంట్స్.. ఫన్నీ మీమ్స్
ఐపీఎల్ చరిత్రలో పదోసారి ఫైనల్స్కు వెళ్లిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రికార్డు సృష్టించింది. తొలి క్వాలిఫయర్లో గుజరాత్ను చిత్తు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) తొలి క్వాలిఫయర్లో గుజరాత్ టైటాన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) అద్భుత విజయం సాధించింది. మ్యాచ్లో ధోనీ ఉంటే ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు తమ పనేదో చేసుకునిపోతుంటారు. మైదానంలో, వెలుపలా వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇరు జట్ల ప్లేయర్లూ బంతితో, బ్యాట్తో పోటీపడతారు తప్ప... నోటికి పని చెప్పే అవసరం పెద్దగా రాదు. అభిమానులు ధోనీ నామజపం చేస్తారు. ఈ క్రమంలో మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న స్పెషల్ మూమెంట్స్.. సోషల్ మీడియాలో వచ్చిన ఫన్నీ మీమ్స్పై ఓ లుక్కేద్దాం..
మ్యాచ్ సందర్భంగా..
- దీపక్ చాహర్ సరదాగా చేసిన పని.. ధోనీతో సహా అందరిలోనూ నవ్వులు పూయించింది. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న విజయ్ శంకర్ను రనౌట్ చేసేందుకు చాహర్ ప్రయత్నించాడు. అయితే, విజయ్ మాత్రం క్రీజ్లోనే ఉన్నాడు. దీంతో ఔట్ కోసం చాహర్ అప్పీలు చేయలేదు. ఆ సంఘటనను చూసిన ధోనీ చిన్నగా నవ్వుకున్నాడు.
- గుజరాత్ ఇన్నింగ్స్లోని 16వ ఓవర్ సందర్భంగా ధోనీ, అంపైర్ల మధ్య స్వల్ప చర్చ జరిగింది. పతిరణను బౌలింగ్కు తెచ్చేందుకు ఉపక్రమిస్తుండగా.. అంపైర్లు ఆపినట్లు ఉన్నారు. కాసేపు డగౌట్కు వెళ్లి రావడంతో వెంటనే బౌలింగ్కు అవకాశం ఇవ్వలేదు. దీనిపైనే అంపైర్లతో ధోనీ చర్చించాడు. చివరికి పతిరణ బౌలింగ్ వేసేందుకు అవకాశం రావడంతో చెన్నై ఆటగాళ్లు, అభిమానులు ఆనందించారు.
- డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా మారిన పతిరణ తన తొలి ఓవర్ రెండో బంతిని 150 కి.మీ వేగంతో విసిరాడు. లాకీ ఫెర్గూసన్ (154.1), ఉమ్రాన్ మాలిక్ (152.1), మార్క్ వుడ్ (151.2) తర్వాత ఈ మార్క్ను తాకిన నాలుగో బౌలర్గా మారాడు. ఆ బంతికి డేవిడ్ మిల్లర్ ఒక్క పరుగు మాత్రమే రాబట్టాడు.
- ధోనీ సతీమణి సాక్షి, కుమార్తె జీవా స్టేడియంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశారు. వికెట్ పడినప్పుడు వారు చేసిన హంగామాను చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు.
సోషల్ మీడియాలో..
- ప్రతి డాట్ బాల్కు 500 చెట్లను నాటేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగా ఎవరైనా బౌలర్ పరుగులు ఇవ్వకుండా డాట్ బాల్ వేస్తే స్కోరు బోర్డుపై ఓ చెట్టును సింబల్గా చూపించారు. దానిపైనా ఓ మీమ్ పుట్టుకొచ్చింది. కేఎల్ రాహుల్ ఆడితే ఓ అడవినే సృష్టించవచ్చనే అర్థంలో ఓ మీమర్ పోస్టు పెట్టాడు.
- విజయ్ శంకర్ను నాన్స్ట్రైకర్ రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన దీపక్ చాహర్ను చూపించి.. ఎలా చేయాలో నేర్చుకోవాలని హర్షల్ పటేల్కు ఆర్సీబీ ఫ్యాన్స్ చెబుతున్నట్లు ఓ మీమ్ రూపొందించారు. ఎందుకంటే లఖ్నవూతో మ్యాచ్లో హర్షల్ కీలక సమయంలో నాన్స్ట్రైకర్ను రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు.
- ‘‘ఇప్పుడు నాకు కొంచెం కొంచెం అర్థమవుతోంది. గతేడాది మేం ఎందుకు కప్ గెలిచామనేది. ఎందుకంటే గత సీజన్ ప్లేఆఫ్స్లో చెన్నై లేదు’’ అని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అనుకున్నట్లు ఓ అభిమాని మీమ్ పెట్టాడు. గత సీజన్లో సీఎస్కే లీగ్ స్టేజ్కే పరిమితమైంది.
- ధోనీని జీవా ఇలా అడుగుతుంది.. ‘డాడీ ఐపీఎల్ అంటే ఏంటి..?’.. దానికి ధోనీ సమాధానం ఇస్తూ.. ‘‘ఇదొక టోర్నీ. సీఎస్కేతో ఆడేందుకు 9 జట్లు పోటీ పడతాయి’’ అని చెబుతున్నట్లు ఉన్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తుషార్ దేశ్ పాండే రెండు సిక్స్లు, ఒక ఫోర్ సహా 19 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో తుషార్తో ధోనీ ఏదో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో మీమర్స్ చెలరేగిపోయారు. ‘‘నువ్వు చేజేతులా ఓడించేందుకు ప్రణాళికను సిద్ధం చేశావా?’’ అని ధోనీ అన్నట్లుగా ఫన్నీ మీమ్ను వదిలారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్