Virat Kohli: బుమ్రా విషయంలో కోహ్లీ అప్పటికప్పుడు నిర్ణయం
టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతడు అనతికాలం...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతడు అనతికాలంలోనే ఫార్మాట్లకతీతంగా మేటి బౌలర్గా ఎదిగాడు. అయితే, అతడి టెస్టు అరంగేట్రం అనూహ్యంగా జరిగిందని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గుర్తుచేసుకున్నారు. తాజాగా ఆయన ఓ క్రీడాఛానెల్తో మాట్లాడుతూ బుమ్రా టెస్టుల్లోకి ఎలా వచ్చాడో వివరించాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పటికప్పుడు ఎంపిక చేశాడని పేర్కొన్నాడు.
‘2018 దక్షిణాఫ్రికా పర్యటనకు మేం 10-12 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేశాము. ఆ సమయంలో నెట్స్లో బుమ్రా సాధన చూసి కోహ్లీ అమితంగా ఆశ్చర్యపోయాడు. అక్కడున్న బౌలర్ల అందరిలో అతడే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. దీంతో వెంటనే బుమ్రాను తొలి టెస్టులో ఆడించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి అతడి కెరీర్ మారిపోయింది. అయితే, అంతకుముందు బుమ్రా వన్డేల్లో ఆడేటప్పుడే టెస్టు క్రికెట్లో రాణించాలని ఉందని నాతో చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో మేటి బౌలర్గా పేరు తెచ్చుకోవాలని ఉందన్నాడు. నేను అదే విషయాన్ని కోచ్ రవిభాయ్తో చెప్పడంతో.. అప్పుడతను బుమ్రాను టెస్టుల్లో ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రాకు టెస్టుల్లో అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. వెంటనే కోహ్లీ కూడా సెలెక్టర్లతో మాట్లాడి అతడిని తొలి టెస్టులో ఆడించాడు’ అని భరత్ అరుణ్ వివరించాడు.
కాగా, అనుకున్నట్లే ఆ సిరీస్లో బుమ్రాకు అవకాశం దక్కడంతో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ సిరీస్లో ఆడిన మూడు టెస్టుల్లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. మూడో టెస్టులో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆపై విదేశాల్లో టీమ్ఇండియా నంబర్ వన్ పేసర్గా ఎదిగాడు. ప్రతి పర్యటనలోనూ అత్యుత్తమంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 27 టెస్టులు ఆడి 113 వికెట్లను పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.