ఊహాజనిత కథనాలు రాయకండి: భువీ
తాను టెస్టు క్రికెట్ ఆడటంపై ఆసక్తి చూపడం లేదనే వార్తలను టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్కుమార్ ఖండించాడు. అందులో ఏ మాత్రం నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. భువికి సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగడం ఇష్టం లేదనే వార్త శనివారం...
టెస్టు క్రికెట్పై స్పష్టతనిచ్చిన టీమ్ఇండియా పేసర్
ఇంటర్నెట్డెస్క్: తాను టెస్టు క్రికెట్ ఆడటంపై ఆసక్తి చూపడం లేదనే వార్తలను టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్కుమార్ ఖండించాడు. అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పాడు. భువీకి సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగడం ఇష్టం లేదనే వార్త శనివారం ఓ ప్రముఖ జాతీయ పత్రికలో కథనంగా వచ్చింది. దానిపై స్పందించిన భువనేశ్వర్ ఓ ట్వీట్ చేశాడు. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా తాను మూడు ఫార్మాట్ల కోసం సన్నద్ధమవుతానని చెప్పాడు.
వచ్చేనెలలో టీమ్ఇండియా ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆగస్టులో ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ రెండింటికీ సంబంధించి బీసీసీఐ కొద్దిరోజుల క్రితం 20 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు స్టాండ్బై కుర్రాళ్లను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. అందులో భువీకి చోటు దక్కకపోవడం గమనార్హం. 2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడిన అతడు తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లోనూ గాయపడగా ఆ టోర్నీతో పాటు తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకూ దూరమయ్యాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల క్రికెట్కు ఎంపికైన భువనేశ్వర్ ఐపీఎల్ 14వ సీజన్లో మళ్లీ గాయాల కారణంగా పలు మ్యాచ్లు ఆడలేకపోయాడు.
ఇలాంటి పరిస్థితుల్లో భువనేశ్వర్ను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది. అయితే, అతడికి టెస్టు క్రికెట్పైన ఆసక్తి లేదని, దాంతో పాటు సెలెక్టర్లు అతడిని వన్డేలకు ఎంపిక చేయడానికి కూడా ఇష్టపడట్లేదని ఆ పత్రిక పేర్కొంది. దానిపై స్పందించిన భువీ ఘాటుగా బదులిచ్చాడు. ‘నేను టెస్టు క్రికెట్ ఆడదల్చుకోలేదనే విధంగా నాపై కథనాలు వచ్చాయి. ఆ విషయంపై స్పష్టతనిస్తున్నా.. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా నేనెప్పుడూ మూడు ఫార్మాట్ల కోసమే సన్నద్ధమయ్యా. ఇకపైనా అలాగే ఉంటా. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పదల్చుకున్నా. ఎవరో చెప్పారని పేర్కొంటూ ఊహాజనిత కథనాలు రాయకండి’ అని ట్వీట్ చేశాడు.
మరోవైపు జులైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్కు భువీ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో కీలక ఆటగాళ్లంతా ఇంగ్లాండ్లో ఉంటుండగా, మిగిలిన క్రికెటర్లు ధావన్, హార్దిక్, పృథ్వీ, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, భువీ లాంటి ఆటగాళ్లు లంకకు పయనమయ్యే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు