bhuvaneswar kumar: ట్రోలర్స్‌కు భువీ భార్య స్ట్రాంగ్‌ కౌంటర్‌

సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ భార్య నుపుర్‌ నగర్‌ ఘాటుగా స్పందించారు..

Published : 22 Sep 2022 20:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ మరోసారి 19వ ఓవర్‌లో 16 పరుగులు ఇవ్వడంతోపాటు తన పూర్తి కోటాలో భారీగా పరుగులు (0/52) సమర్పించడంతోనే టీమ్‌ఇండియా ఓడిందని నెటిజన్లు అతడిపై ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా ఈ క్రికెటర్‌ భార్య నుపుర్‌ నగర్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. 

‘‘ఈ మధ్య పనీపాటా లేని వారంతా ద్వేషపూరిత ప్రచారాలు చేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ మిమ్మల్ని పట్టించుకునేవారు, మీ వ్యాఖ్యల వల్ల ప్రభావితం అయ్యేవారు ఎవరూ లేరని గుర్తించండి. ఆ సమయాన్ని మిమ్మల్ని మీరు ఉత్తమంగా మలుచుకోవడానికి కేటాయించుకోండి’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీని పోస్ట్‌ చేశారు. అయితే కాసేపటికే స్టోరీని మార్చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని