India vs Srilanka: ‘కుల్చా’కు ఇదో గొప్ప ఛాన్స్!
శ్రీలంకతో మూడు వన్డేల్లో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కాలని టీమ్ఇండియా సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మ్ణ్ అన్నాడు. ఎక్కువ బౌలింగ్ చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా టీ20 ప్రపంచకప్లో ఉండాల్సిన...
దిల్లీ: శ్రీలంకతో మూడు వన్డేల్లో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కాలని టీమ్ఇండియా సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మ్ణ్ అన్నాడు. ఎక్కువ బౌలింగ్ చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా టీ20 ప్రపంచకప్లో ఉండాల్సిన ఆటగాడని పేర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత కుల్దీప్, చాహల్ ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
‘కుల్దీప్, చాహల్ మూడు వన్డేల్లో ఆడాలని కోరుకుంటున్నా. వన్డేల్లో ప్రతి బౌలర్కు పది ఓవర్లు దొరకుతాయి. అంటే ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే వారంత ఎక్కువ విజయవంతం అవుతారు. తిరిగి ఆత్మవిశ్వాసం పొందుతారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్! ఇక చాహల్ విజయవంతమైన బౌలర్. మంచి అనుభవం ఉంది. ధీమాగా ఉంటాడు. జట్టులో కీలక సభ్యుడు. టీ20 ప్రపంచకప్ అతడి మదిలో ఉండే ఉంటుంది’ అని లక్ష్మణ్ అన్నాడు.
యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాల్సిన ఆటగాడని లక్ష్మణ్ అన్నాడు. ‘మూడో స్థానంలో సూర్య కుమార్ బ్యాటింగ్ చూడటం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అతడు మొదటి షాట్ ఆడాడు. అప్పుడు కొట్టిన షాట్ అతడిలోని ఆత్మ విశ్వాసాన్ని చూపిస్తోంది. అతడికున్న ప్రతిభ, తెలివితేటలకు ఇదో గొప్ప అవకాశం’ అని తెలిపాడు.
శ్రీలంకపై ఆరు మ్యాచుల్లో సూర్యకుమార్ ఆడాలని లక్ష్మణ్ కోరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పరుగులు చేస్తూ ఆత్మవిశ్వాసం సాధించాలని, ఎదగాలని కోరుకుంటున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.